China Corona: చైనాలో 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కరోనా.. సీక్రెట్‌ డేటా లీక్‌

కరోనా మళ్లీ భయపెడుతోంది. చైనాలో కేసులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడ కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను..

China Corona: చైనాలో 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కరోనా.. సీక్రెట్‌ డేటా లీక్‌
Corona
Follow us

|

Updated on: Dec 25, 2022 | 7:11 AM

కరోనా మళ్లీ భయపెడుతోంది. చైనాలో కేసులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడ కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనాలో డిసెంబర్‌ మొదటి 20 రోజుల్లోనే 25 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది. చైనా ఆరోగ్య సంస్థ ‘ఎన్‌హెచ్‌సి’ సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ సిఎన్‌ఎన్ పేర్కొంది. జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు. కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62,592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని సీఎన్‌ఎన్‌ తెలిపింది.

18% జనాభా కోవిడ్ బారిన పడే అవకాశం:

బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికల ప్రకారం, డిసెంబర్ మొదటి 20 రోజుల్లోనే చైనాలో దాదాపు 250 మిలియన్లు మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని చైనా ఉన్నత ఆరోగ్య అధికారులు అంతర్గతంగా అంచనా వేసింది. ఈ గణాంకాలు బుధవారం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (NHC) అంతర్గత సమావేశంలో సమర్పించబడ్డాయి. ఈ గణాంకాలు సరైనవే అయితే, 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో 18 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని అర్థం. ప్రపంచంలోని ఏ దేశం నుండి కోవిడ్ సోకిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ.

ఒక్కరోజులో 3.70 కోట్లు పాజిటివ్ కేసులు:

ఫైనాన్షియల్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ అధికారులు జరిపిన చర్చలను వివరించాయి. చైనాలో మంగళవారం మాత్రమే 3 కోట్ల 70 లక్షల మంది కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్లు రెండు మీడియాలు తమ నివేదికలలో వెల్లడించాయి. అయితే చైనా ప్రభుత్వం మరోసారి డేటాను తారుమారు చేసింది. ఆ రోజు చైనా అధికారికంగా 3,049 కేసులను మాత్రమే నమోదు చేసింది. డిసెంబర్‌లో కరోనా వ్యాప్తికి అతిపెద్ద కారణం చైనాలో గత మూడేళ్లుగా అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానాన్ని అకస్మాత్తుగా రద్దు చేయడమేనని అంటున్నారు. అయితే ఇక్కడ ఎన్‌హెచ్సీ సమావేశం నుండి లీక్ అయిన పత్రాల గురించి ఇమెయిల్ పంపడం ద్వారా చైనీస్ ఆరోగ్య శాఖ వైపు నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. అయితే ప్రస్తుతానికి చైనా నుండి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రహస్య సమావేశం నుంచి సీక్రెట్ రిపోర్ట్ లీక్:

ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఎన్‌హెచ్‌సి డిప్యూటీ డైరెక్టర్ సన్ యాంగ్ ఈ గణాంకాలను సమర్పించారని ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలోని వివరాలు రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నాంచారని, దీని గురించి తెలిసిన ఇద్దరు అధికారులు తమకు పత్రాలు ఇచ్చారని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది.

కోవిడ్ మరణానికి గల కారణాలను ఇప్పుడు అప్‌డేట్ చేసినట్లు చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు. చైనా ప్రభుత్వం కొత్త సూచనల ప్రకారం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా మరణాలు మాత్రమే కోవిడ్ మరణాలుగా పరిగణించబడతాయి. చైనాలో కోవిడ్ సంక్రమణ రేటు ఇంకా పెరుగుతోందని, బీజింగ్, సిచువాన్‌లలో జనాభాలో సగానికి పైగా కరోనా బారిన పడ్డారని సన్ యాంగ్ సమావేశంలో చెప్పారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

చైనా డేటా ఇవ్వడం మానేసింది

కోవిడ్‌కు సంబంధించి చైనా ఇప్పటికే తప్పుడు గణాంకాలను చూపుతోందని, ఇప్పుడు ఆ సమాచారాన్ని కూడా ఇవ్వడం మానేసింది. అక్కడ కోవిడ్ పరీక్ష బూత్‌లు కూడా మూసివేయబడ్డాయి. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం చెలరేగడంతో జి జిన్‌పింగ్ అలాంటి చర్య తీసుకున్నారు. అధికారికంగా చైనా డిసెంబర్‌లో ఎనిమిది కోవిడ్ మరణాలను మాత్రమే నివేదించింది. అయితే అసలైన గణాంకాలను చూస్తే వేలల్లో ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?