పాత పాటనే కొత్తగా పాడుతున్న చైనా..అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం..చాల్చాల్లే ఫో అంటున్న భారత్!

China vs India: చైనా మళ్లీ నాలుగేళ్ల నాటి చర్యనే పునరావృతం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని 15 ప్రదేశాలకు చైనీస్- టిబెటన్ అని పేరు పెట్టింది.

పాత పాటనే కొత్తగా పాడుతున్న చైనా..అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం..చాల్చాల్లే ఫో అంటున్న భారత్!
China Vs India
Follow us

|

Updated on: Dec 31, 2021 | 9:09 AM

China vs India: చైనా మళ్లీ నాలుగేళ్ల నాటి చర్యనే పునరావృతం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని 15 ప్రదేశాలకు చైనీస్- టిబెటన్ అని పేరు పెట్టింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ – ఇది మన సార్వభౌమాధికారం.. చరిత్ర ఆధారంగా తీసుకున్న చర్య. ఇది చైనా హక్కు. వాస్తవానికి, చైనా దక్షిణ టిబెట్‌ను తన భూభాగంగా సూచిస్తుంది. భారత్ తన టిబెట్ భూభాగాన్ని విలీనం చేసి అరుణాచల్ ప్రదేశ్‌గా మార్చిందని ఆరోపిస్తూ వస్తోంది. గతంలో 2017లో చైనా 6 స్థలాల పేర్లను మార్చింది. చైనా చేసిన ఈ చర్యకు భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ – అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని అన్నారు. పేరు మార్చడం వల్ల నిజం మారదు. 2017లో కూడా చైనా ఇదే అడుగు వేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది అని స్పష్టం చేశారు.

పేర్లు విడుదల చేసిన స్టేట్ కౌన్సిల్ 

చైనా అధికారిక వార్తాపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం – గురువారం, చైనా మంత్రివర్గం (స్టేట్ కౌన్సిల్) 15 పేర్ల మార్పులను ఆమోదించింది. ఈ ప్రాంతాలన్నీ జెంగ్నాన్ (చైనా దక్షిణ రాష్ట్రమైన షిజియాంగ్‌లో భాగం) పరిధిలోకి వస్తాయి. వీటిలో 8 నివాస ప్రాంతాలు. నాలుగు పర్వత ప్రాంతాలు, రెండు నదులు.. ఒక పర్వత మార్గం లేదా కొండ కనుమ. గతంలో 2017లో 6 స్థలాల పేర్లు మార్చారు. ఇది చైనా హక్కు. టిబెట్ వ్యవహారాలపై చైనా నిపుణుడు లియన్ జియాంగ్మిన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ – ఈ ప్రదేశాలు వందల సంవత్సరాలుగా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు సరిచేశారు. దీని ద్వారా సరిహద్దుల రక్షణ మరింత మెరుగ్గా మెరుగుపడుతుంది.

రెండు నెలల క్రితం ఈ చట్టాన్ని రూపొందించారు

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ గుర్తించలేదు. దాన్ని భారత్ ఆక్రమించిందని ఆరోపించారు. బీజింగ్ 23 అక్టోబర్ 2021న ‘ల్యాండ్ బోర్డర్ లా’ అనే చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాతే అతడు ఇలాంటి పని చేస్తాడేమోనన్న భయం నెలకొంది. ఈ చర్యతో భయాందోళనలు నిజమయ్యాయి. ఏప్రిల్ 2017లో టిబెటన్ మత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా – దలైలామా కార్యకలాపాలు చైనాకు భారత్ చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. చైనా స్థలాల పేర్లను మారుస్తోంది, కాబట్టి వాటిని వారి భాషతో అనుసంధానించడం అవసరం. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్, అది మన భూభాగంలోకి వస్తుంది. అరుణాచల్..అక్సాయ్ చిన్‌పై కూడా వివాదాలు

3488 కిలోమీటర్ల పొడవైన LAC (వాస్తవ నియంత్రణ రేఖ)పై రెండు దేశాల మధ్య వివాదం ఉంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లోని భాగాన్ని చైనా కూడా వివాదాస్పదంగా పరిగణిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 520 కి.మీ పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అరుణాచల్ సాంప్రదాయకంగా దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదించగా, భారతదేశం అక్సాయ్ చిన్ ప్రాంతం తమదని పేర్కొంది. 1962 యుద్ధంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది.

వాస్తవానికి, ఇలా ఒక ప్రాంతం పేరు మార్చడం కోసం స్థిరమైన నియమాలు.. ప్రక్రియలు ఉన్నాయి. ఒక దేశం ఒక స్థలం పేరును మార్చాలనుకుంటే, అది ముందుగా UN గ్లోబల్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయాలి. దీని తరువాత, UN భౌగోళిక నిపుణులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ సమయంలో ప్రతిపాదిత పేరును పరిశీలిస్తారు. స్థానికులతో చర్చలు జరుపుతారు. వాస్తవాలు నిజమైతే, పేరు మార్పు ఆమోదిస్తారు. తరువాత అదే రికార్డ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి: Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..