AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. రక్తపాతాన్ని నివారించేందుకేనని ప్రకటన

ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ నుంచి పారిపోయారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకే తాను పారిపోయానని ఆయన ప్రకటించాడు.

కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. రక్తపాతాన్ని నివారించేందుకేనని ప్రకటన
Afghanistan President Ashraf Ghani
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 16, 2021 | 12:49 PM

Share

ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ నుంచి పారిపోయారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకే తాను పారిపోయానని ఆయన ప్రకటించాడు. తను కాబూల్ లోనే ఉన్న పక్షంలో ఎంతోమంది దేశభక్తులు అమరులయ్యేవారని, ఈ నగరం నాశనమై పోయేదని ఆయన అన్నాడు. తాలిబన్లే గెలిచారని, ఇక ఈ దేశ ప్రజల గౌరవం, వారి ఆస్తుల బాధ్యత వారిదేనని పేర్కొన్నాడు. నేను తజికిస్థాన్ వెళ్ళిపోయాను అని ఆయన తెలిపాడు. అయితే ప్రజలను ఈ స్థితిలో వదిలి ఘని వెళ్లిపోయాడంటూ శాంతి ప్రక్రియ చర్చలకు నేతృత్వం వహించిన అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. ఆయన ఇలా చేసి ఉండవలసింది కాదని అభిప్రాయపడ్డాడు. కాగా-నిన్న అధ్యక్ష భవనం తాలిబాన్లకు పూర్తిగా వశమైంది. వందలాది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయం వద్ద తమ కుటుంబాలతో సహా అక్కడికి చేరుకున్నారు. మహిళలు, పిల్లలు విమానాశ్రయ ఆవరణలో కనిపించారు. మరోవైపు తాలిబన్లు.. కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నందుకు హర్షం ప్రకటిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు నేడు ఎంతో గొప్ప దినమని, 20 ఏళ్ళ త్యాగాలకు, తమ ప్రయత్నాలకు వారు తగిన ఫలాలు అందుకున్నారని తాలిబన్ల పొలిటికల్ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ నయీం అన్నారు. దేశంలో వార్ పూర్తి అయిందని, తాము శాంతియుత అంతర్జాతీయ సంబంధాలను కోరుతున్నామని ఆయన పేర్కొన్నాడు.

కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో, దీని రూపు రేఖలేమిటో త్వరలో ప్రకటిస్తాం అని నయీమ్ అన్నాడు. ప్రజలెవరికీ హాని చేయబోమని ఆయన హామీ ఇచ్చాడు. అటు అమెరికన్ సైనికులు.. ఆఫ్ఘన్ లోని తమ దేశస్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ లో నాయకత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధ్యక్షుడు జోబైడెన్ ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. కాబూల్ లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై తమ దేశ జాతీయ పతాకాన్ని దించివేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. కాబూల్ లో నిన్న అక్కడక్కడా గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించినా మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: IND vs ENG: బాల్ టాంపరింగ్..! బూట్లతో బంతి ఆకారం మార్చేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నం.. హెచ్చరించని అంపైర్లు

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మరో రికార్డు..! ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్టే అంటూ నెటిజన్ల కామెంట్లు