AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..

గత వారం దుర్గా పూజ సందర్భంగా ఆలయ విధ్వంస ఘటనలతో బంగ్లాదేశ్‎లో హింస చెలరేగింది. ఓ గ్రామంలో అరవై ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి...

Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..
Bangladesh
Srinivas Chekkilla
|

Updated on: Oct 18, 2021 | 7:08 PM

Share

గత వారం దుర్గా పూజ సందర్భంగా ఆలయ విధ్వంస ఘటనలతో బంగ్లాదేశ్‎లో హింస చెలరేగింది. ఓ గ్రామంలో అరవై ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 హిందువుల ఇళ్లను దహనం చేశారు. రాజధాని నగరం ఢాకాకు 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. గ్రామానికి చెందిన ఒక హిందూ యువకుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో మతాన్ని అగౌరవపరిచాడని పుకారు రావడంతో పోలీసులు మత్స్యకారుల కాలనీకి వెళ్లారు. పోలీసులు ఆ వ్యక్తి ఇంటి చుట్టూ కాపలాగా ఉండడంతో, దాడి చేసిన వారు సమీపంలోని ఇతర ఇళ్లకు నిప్పుపెట్టారని తెలిసింది.

ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ మాజిపారాలో 29 నివాస గృహాలు, రెండు వంటశాలలు, రెండు బార్న్‌లు, 20 గడ్డివాములను తగలబెట్టినట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజాము 4:10 వరకు మంటలను ఆర్పివేశారని స్థానికి మీడియా పేర్కొంది. ప్రాణనష్టం గురుంచి ఎలాంటి సమాచారం లేదు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో మత విద్వేషాల వ్యాప్తికి సంబంధించి పోస్టులు చేసిన డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్.. చాంద్పూర్, నోఖాలీలో జరిగిన దాడులలో కనీసం నలుగురు హిందూ భక్తులు మరణించారని ఆరోపించారు. ఇంతలో ఢాకా నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలో హిందువులకు చెందిన దేవాలయాలు, దుకాణాలపై దాడులకు సంబంధించి ఎలైట్ నేర నిరోధక శక్తి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. “మతపరమైన హింసకు పాల్పడినందుకు, సోషల్ మీడియాలో ప్రజలను ప్రేరేపించినందుకు వారిని అరెస్టు చేశారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు” అని పారామిలిటరీ ఫోర్స్ లీగల్ అండ్ మీడియా వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

ప్రధాన మంత్రి షేక్ హసీనా హింస వెనుక ఉన్న దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చింది. హిందూ దేవాలయాలు, కుమిల్లాలోని దుర్గా పూజ వేదికలపై దాడుల్లో పాల్గొన్న తప్పించుకోలేరని తెలిపారు. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు ఏ మతానికి చెందినవారైనా శిక్షించబడతారని ధాకేశ్వరిలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.

Read Also.. Viral Video: క్యాన్సర్‎ను జయించిన బాలుడు.. ఆస్పత్రి బయటకు వచ్చి తండ్రితో ఏం చేశాడంటే..

Follow Us
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?