AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..

Tirumala: హిందువులు వైకుంఠ ఏకాదశిని పవిత్రం భావిస్తారు ఈరోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు పోతెట్టుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో (Tirumala) భక్తులు బారులు..

Tirumala: అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Jan 12, 2022 | 11:43 AM

Share

Tirumala: హిందువులు వైకుంఠ ఏకాదశిని పవిత్రం భావిస్తారు ఈరోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు పోతెట్టుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో (Tirumala) భక్తులు బారులు తీరుతారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమల తిరుపతికి చేరుకుంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానునుంది. ఈ నెల 13వ తేది నుంచి 22వ తేది వరకు భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే వీలుని టిటిడీ (TTD) అధికారులు కల్పించారు.

శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించిన అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు. వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం 1949లో నుంచి టిటిడీ ప్రారంభించింది. అప్పటి నుంచి రోజు రోజుకీ ముక్కోటి ఏకాదశికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపొతూ వచ్చింది. అంతమంది భక్తులకు ఒకే రోజు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇవ్వలేని టిటిడీ కీలక నిర్ణయం తీసుకుంది.

2020 నుంచి శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి ప్రారంభించింది. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టిటిడీ టోకెన్లను జారీ చేసింది. రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని.. టిటిడీ కోరుతుంది. మరోవైపు ఈ నెల 22 వరకు సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

దేవతలకు ఒక్క రోజు మానవులుకు 365 రోజులుగా పెద్దల నమ్మకం.మహావిష్ణువు ముక్కోటి దేవతలకు 40 నిమిషాలు దర్శన భాగ్యం కల్పిస్తే.. వైకుంఠ ఏకాదశి నుంచి వచ్చే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ.

Also Read:  అర్ధరాత్రి సజ్జనార్ కు యువతి ట్వీట్.. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ఆర్టీసీ ఎండీ

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..