తిరుమల లడ్డూకీ ఆధార్‌ లింక్‌.. టీటీడీ నిర్ణయంపై భక్తుల అసంతృప్తి

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ, బ్యాంక్‌ అకౌంట్లకు కానీ, ఆఖరికి సిమ్‌ కార్డ్‌ కొనాలన్నా కానీ ఆధార్‌ లింక్‌ తప్పనిసరి. దేశంలో ప్రతి పౌరుడికీ ఆధార్‌ అనేది ప్రథమ గుర్తింపుగా మారింది. దీంతో అప్పడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇది తప్పనిసరి అయింది. ప్రతీ దానికీ ఆధార్‌ లింక్‌ లేనిదే పని జరగని పరిస్థితి. చివరికి తిరుమల తిరుపతిలో లడ్డూ కొనాలన్నా కూడా ఆధార్‌ చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow us

|

Updated on: Sep 02, 2024 | 8:32 PM

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ, బ్యాంక్‌ అకౌంట్లకు కానీ, ఆఖరికి సిమ్‌ కార్డ్‌ కొనాలన్నా కానీ ఆధార్‌ లింక్‌ తప్పనిసరి. దేశంలో ప్రతి పౌరుడికీ ఆధార్‌ అనేది ప్రథమ గుర్తింపుగా మారింది. దీంతో అప్పడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇది తప్పనిసరి అయింది. ప్రతీ దానికీ ఆధార్‌ లింక్‌ లేనిదే పని జరగని పరిస్థితి. చివరికి తిరుమల తిరుపతిలో లడ్డూ కొనాలన్నా కూడా ఆధార్‌ చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును, మీరు విన్నది నిజమే.. ప్రభుత్వ పథకాలే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా ఆధార్ కార్డుకు లడ్డుకూ టీటీడీ అధికారులు లింక్ పెట్టారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. భక్తుడికి ఒక లడ్డూతో పాటు ఆధార్ కార్డు ఉంటే అదనంగా మరో లడ్డూ ఇస్తున్నారు. మొత్తం దర్శనం టికెట్ పై ఒక లడ్డూ, ఆధార్ కార్డు పై మరో లడ్డూను టీటీడీ అధికారులు అందిస్తున్నారు. ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీని వెనక్కు నెట్టిన అదానీ.. భారత కుబేరుల లిస్ట్‌లో షారూఖ్‌ ఖాన్‌

పొరపాటున పూజారి అకౌంట్​లోకి రూ. కోటిన్నర.. తరువాత..

Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్‌ను ఇరగదీసిన రాహుల్ గాంధీ

సెట్ టాప్‌ బాక్స్‌ కోసం జియో టీవీ ఓఎస్‌ !! కాల్‌లోనే AI సేవలు

జియో యూజర్లకు బంపర్ ఆఫర్ !! వెల్‌కమ్ ఆఫర్‌ కింద 100 జీబీ ఉచిత స్టోరేజీ