AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: జాతీయ విద్యావిధానంతో మళ్లీ విద్యావ్యవస్థకు వెలుగు: కిషన్ రెడ్డి

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థకు మళ్లీ వెలుగులు అందించేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ‘శ్రీ గురు భాగవతం’ తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి..

Ravi Kiran
|

Updated on: Sep 25, 2023 | 8:32 AM

Share

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థకు మళ్లీ వెలుగులు అందించేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. శిల్పకళావేదికలో మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశనుంచే పురాణాలు, ఇతిహాసాలపై ఆసక్తికలిగించేలా విద్యాబోధన సాగాలని అభిప్రాయపడ్డారాయన.

అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. అప్పులు చేసి కోచింగ్‌ తీసుకున్న నిరుద్యోగులు… కేసీఆర్‌ సర్కార్‌ తీరుతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారాయన. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి