AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ఇది ప్రజా ప్రభుత్వం.. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 15,750 మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు. ప్రక్రియ పూర్తైన అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో రేవంత్ ప్రభుత్వం నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.

Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2024 | 6:47 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 15,750 మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు. ప్రక్రియ పూర్తైన అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో రేవంత్ ప్రభుత్వం నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 15వేలకు పైగా పోలీసులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మనమే వస్తామని.. ఎవరూ అధైర్యపడొద్దని నల్గొండ సభలో అన్నారు కేసీఆర్. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉంటా! ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే! అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి మళ్లీ వస్తాం అంటున్నారు.. నేను ఇక్కడే ఉంటా.. ఎలా వస్తారో చూస్తా.. అంటూ పేర్కొన్నారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకంటూ ఎద్దెవా చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..