AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన వృద్ధుడు!

ఓ వృద్ధుడు మృత్యువును తాకి తిరిగి వచ్చారు. వృద్ధుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిని చితిపైకి చేర్చారు. చివరిసారిగా అతనికి గంగా జలాన్ని నోట్లో పోయాడంతో ఒక్కసారిగా లేచి కూర్చుకున్నాడు.

Viral News: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన వృద్ధుడు!
Dead Man
Balaraju Goud
|

Updated on: Dec 28, 2021 | 11:01 AM

Share

Delhi Dead Man stand up: ఓ వృద్ధుడు మృత్యువును తాకి తిరిగి వచ్చారు. వృద్ధుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిని చితిపైకి చేర్చారు. చివరిసారిగా అతనికి గంగా జలాన్ని నోట్లో పోయాడంతో ఒక్కసారిగా లేచి కూర్చుకున్నాడు. ఈ హఠాత్తు పరిణామంతో బంధుమిత్రులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సతీష్ భరద్వాజ్ అనే వ్యక్తి మరణవార్త కుటుంబ సభ్యులందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. బంధుమిత్రులలందరికీ సమాచారం అందించారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అయితే మృతదేహనికి నిప్పంటించే ముందు.. చితిపై చనిపోయిన వ్యక్తి సజీవంగా ఉన్నాడు.

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఆదివారం ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చనిపోయిన వ్యక్తి శ్మశాన వాటిక నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, తిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల పెద్ద సతీష్ భరద్వాజ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. క్యాన్సర్ కారణంగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. వెంటిలేటర్‌పై ఖర్చు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం ఇంటికి తీసుకెళ్లగా వృద్ధుడు మృతి చెందినట్లు కుటుంబీకులు భావించారు. అనంతరం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సన్నాహకాలు పూర్తి చేసి శ్మశాన వాటికకు తీసుకొచ్చేసరికి వృద్ధుడి ముఖంలో ఏదో కదలిక రావడం, మెల్లగా కళ్లు తెరిచి చూడడం కొందరు చూశారు. శవానికి నిప్పంటించే ముందు అతని ముఖంపై ఉన్న ముసుగు తొలగించి, నోట్లో తులసి తీర్థంగా గంగా జలాలను పోశారు కుటుంబసభ్యులు. అంతే ఆ వృద్ధుడు చితిపై ఉన్న శవం అటు ఇటు కదలడంతో అందరు అశ్చర్యానికి గురయ్యారు. వృద్ధులు ఊపిరి పీల్చుకుంటున్నారని, వారు నెమ్మదిగా కళ్లు తెరుస్తున్నారని పేర్కొన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, వృద్ధుడు సజీవంగా కనిపించాడు. ఆ తర్వాత అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రిలో చేర్చారు.ఆసుపత్రికి చేరుకున్న వృద్ధుడు అకస్మాత్తుగా కళ్లు తెరిచాడు. ఆసుపత్రిలో పరీక్షించగా, రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, గుండె కొట్టుకోవడం, పల్స్ రేటు కూడా సాధారణంగా ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన వైద్యులు, అక్కడ చికిత్స అందిస్తున్నారు.

Read Also…  Kidney Failure: మూత్రంలో సమస్యతోపాటు ఈ లక్షణాలుంటే.. కిడ్నీ ఫెయిల్యూర్‌‌కు దారి తీసినట్లే..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...