Watch Video: దేశమంతటా భారీ వర్షాలు.. రైల్లోనూ ఆగని వాన.. ప్రయాణికుల పరిస్థితి ఇది..!

ఇప్పుడు ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రైల్లోనే నీళ్లు కారుతున్నాయని, పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వీడియో పాతదేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Watch Video: దేశమంతటా భారీ వర్షాలు.. రైల్లోనూ ఆగని వాన.. ప్రయాణికుల పరిస్థితి ఇది..!
Water Dripping Train
Follow us

|

Updated on: Jul 01, 2024 | 11:13 AM

దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు నగరాలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. రోడ్లు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. విమానాశ్రయాలు, కార్యాలయాలు జలదిగ్భందంలో కూరుకుపోతున్నాయి. ఇక రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు.. రైలు పైకప్పులు కూడా లీక్‌ అవుతున్నాయి. అదేంటని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో రైలు కోచ్‌లో ప్రయాణికులు గొడుగులు పట్టుకుని నిల్చున్న దృశ్యం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను కాంగ్రెస్ షేర్ చేయడంతో రైల్వే మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది.

వైరల్ వీడియోలో రైలు కోచ్‌లో గొడుగు పట్టుకుని నిలబడి ఉన్న ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఎందుకంటే.. ఆ రైలు పైకప్పు నుంచి వర్షం కురుస్తుంది..అవును బయట వర్షం పడుతుండగా, రైలు పైకప్పు లీక్‌ అవుతోంది. దాంతో రైల్లో ప్రయాణిస్తున్న వారు గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఇక కొందరు అమ్మాయిలు సరదాగా వర్షంలో డ్యాన్స్ చేస్తూ గొడుగు కిందకు చేరుకుంటున్నారు. అందరూ కలిసి ఒకే గొడుకు కింద నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. రైలు పైకప్పు నుంచి నీరు కారుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టం కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో కొంతమంది ప్రయాణీకులు దూరంగా ఉన్న సీట్లలో కూర్చొని ఉండగా, కొంతమంది యువకులు నీరు కారుతున్న ప్రదేశంలో నిలబడి ఫోటోలు తీస్తున్నారు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రైల్లోనే నీళ్లు కారుతున్నాయని, పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వీడియో పాతదేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..