పిల్లలతో సరదాగా బీచ్ కు వెళ్ళింది.. చిన్నారులు తెలియక చేసిన పనికి రూ. 73 లక్షల జరిమానా కట్టాల్సి వచ్చింది.

మొత్తానికి పిల్లలు అక్కడ నుంచి 72 షెల్స్ ను తీసుకున్నారు. అప్పుడు అది నేరమని అమాయకులైన పిల్లలకు తెలియదు. బీచ్ నుంచి తిరిగి వస్తున్న పిల్లలను వెంటనే మత్స్యశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం షార్లెట్ రస్ కు జరిమానాకు సంబంధించిన రసీదును వెంటనే అందజేశారు. నిజానికి ఇక్కడి నుంచి ఈ రకమైన షెల్స్ ను తీసుకుని వెళ్లడం నేరమని వారికి తెలియదు. దీంతో వారు ఈ గవ్వలను  తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకు ఈ జరిమానా విధించారు.

పిల్లలతో సరదాగా బీచ్ కు వెళ్ళింది.. చిన్నారులు తెలియక చేసిన పనికి రూ. 73 లక్షల జరిమానా కట్టాల్సి వచ్చింది.
Pismo Beach
Follow us

|

Updated on: May 24, 2024 | 8:16 PM

మనం ఎక్కడికైనా, ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతం గురించి అక్కడి నియమాల గురించి బాగా తెలుసుకోవాలి. లేదంటే తెలిసి తెలియక చేసే చిన్న పొరపాటు కూడా మనపై మోయలేని విధంగా భారం పడుతుంది. చిన్న చిన్న పొరపాట్లకు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనే విషయం తరచుగా వినే ఉంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఈరోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి తప్పుకు ఓ మహిళ రూ.73 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.

ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఇక్కడ షార్లెట్ రస్ అనే మహిళ తన పిల్లలతో కలిసి పిస్మో బీచ్‌కి వెళ్లింది. ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోని క్లామ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. క్లామ్ అనేది ఒక రకమైన గవ్వలు, దీని ఆకారం షెల్ లా ఉంటుంది. చాలా మనోహరంగా కనిపిస్తుంది. షార్లెట్ పిల్లలు వాటిని చూసిన వెంటనే వాటిని తమతో ఉంచుకోవడానికి సేకరించడం ప్రారంభించారు.

ఇంత భారీ జరిమానా ఎందుకు విధించారంటే? మొత్తానికి పిల్లలు అక్కడ నుంచి 72 షెల్స్ ను తీసుకున్నారు. అప్పుడు అది నేరమని అమాయకులైన పిల్లలకు తెలియదు. బీచ్ నుంచి తిరిగి వస్తున్న పిల్లలను వెంటనే మత్స్యశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం షార్లెట్ రస్ కు జరిమానాకు సంబంధించిన రసీదును వెంటనే అందజేశారు. నిజానికి ఇక్కడి నుంచి ఈ రకమైన షెల్స్ ను తీసుకుని వెళ్లడం నేరమని వారికి తెలియదు. దీంతో వారు ఈ గవ్వలను  తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకు ఈ జరిమానా విధించారు. ఫిషింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వీటిని పట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

షార్లెట్ తన పిల్లలతో తిరిగి వస్తున్నప్పుడు జరిమానాకు సంబంధించిన రశీదును తన వద్ద ఉంచుకున్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఇమెయిల్ వచ్చినప్పుడు ఆమె దానిని చూసి ఆశ్చర్యపోయింది. మత్స్యశాఖ షార్లెట్ రస్ కు $88,993 అంటే మన దేశ కరెంసిలో సుమారు రూ.73 లక్షల జరిమానా విధించింది. అది చూసి తన ట్రిప్ మొత్తం నాశనమైపోతుందని అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ జరిమానా నుంచి ఉపశమనం లభించదని గ్రహించిన షార్లెట్ రస్ కోర్టుకు వెళ్లి క్షమాపణలు చెప్పింది. ఆపై కోర్టు జరిమానాను 500 డాలర్లకు తగ్గించింది. అయినప్పటికీ మహిళ రూ.41619 జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

దీనికి సంబంధించి ఇక్కడి మత్స్యకారులు రోజుకు 10 పిస్మో క్లామ్‌లను మాత్రమే సేకరించాలనే నిబంధన ఉంది. వీటిని 4.5 అంగుళాల వరకు పెంచడమే మత్స్యశాఖ లక్ష్యం. తద్వారా అవి ప్రతి సంవత్సరం గుడ్లు పెట్టి సంతానం పొందుతాయి. ఈ నేపధ్యంలో అరుదైన షెల్స్ ను పట్టుకున్నందున షార్లెట్ రస్ కు ఇంత భారీ జరిమానా విధించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..