AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌ వేలం.. నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఎంతో తెలుసా..?

ఈసారి కూడా ఆమె తన స్టైల్, గ్రేస్‌తో అందరి చూపు ఆమెవైపునే ఉండేలా కనిపించారు. తాజాగా దుబాయ్‌లోని జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2025 వేలంలో మరోసారి తన ఫ్యాషన్‌ సెన్స్‌ను ప్రదర్శించారు నీతా అంబానీ. తొలిరోజు కార్యక్రమంలో నీతా ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్‌ వేలం.. నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఎంతో తెలుసా..?
Nita Ambani
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2024 | 9:00 PM

Share

IPL టీమ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ IPL 2025 వేలం మొదటి రోజున తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. నీతా అంబానీ లుక్ ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా ఆమె తన స్టైల్, గ్రేస్‌తో అందరి చూపు ఆమెవైపునే ఉండేలా కనిపించారు. తాజాగా దుబాయ్‌లోని జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2025 వేలంలో మరోసారి తన ఫ్యాషన్‌ సెన్స్‌ను ప్రదర్శించారు నీతా అంబానీ. తొలిరోజు కార్యక్రమంలో నీతా ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ ప్యాంట్‌సూట్‌ ధర 950 డాలర్లు(భారత కరెన్సీలో రూ.78వేలు) అని తెలిసింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఐపీఎల్ మెగా వేలం-2025 మొదటి విడత ప్రక్రియ ఆదివారం ముగిసింది. అంచనాలను నిజం చేస్తూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.5 కోట్లు పలికారు. మరికొందరు ప్రతిభావంతులైన క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. కాగా ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ హాజరయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..