AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నక్షత్రమండలం నుంచి భూమిని చేరిని అరుదైన ‘నలుపు’ వజ్రం.. త్వరలోనే వేలం!

లండన్‌లో అరుదైన వజ్రాన్ని వేలం వేయనుంది సోతెబీ అనే సంస్థ. మనం ఇప్పటి వరకు పింక్‌, బ్లూ, గ్రీన్‌ డైమండ్స్‌ చూశాం. కానీ నల్లని వజ్రాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.

Viral: నక్షత్రమండలం నుంచి భూమిని చేరిని అరుదైన ‘నలుపు’ వజ్రం.. త్వరలోనే వేలం!
Space Diamond
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2022 | 9:53 PM

Share

లండన్‌లో అరుదైన వజ్రాన్ని వేలం వేయనుంది సోతెబీ అనే సంస్థ. మనం ఇప్పటి వరకు పింక్‌, బ్లూ, గ్రీన్‌ డైమండ్స్‌ చూశాం. కానీ నల్లని వజ్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది నక్షత్రమండలం నుంచి ఊడి పడిన అరుదైన వజ్రం. దీనిపేరు ‘ఎనిగ్మా’.  555.55 క్యారెట్ల బరువైన ఈ వజ్రాన్ని తొలిసారి దుబాయ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇప్పుడు లండన్‌కి చెందిన సోతెబీ సంస్థ ఈ వజ్రాన్ని వేలానికి పెడుతోంది.

260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు. ‘‘సహజసిద్ధంగా నలుపు రంగులో వచ్చిన ఈ వజ్రం చాలా రేర్, దీని ఉద్భవం ఇప్పటికీ మిస్టరీనే’’ అనీ, 20 ఏళ్ల క్రితం వరకు ఈ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని వివరించారు. ఆ తర్వాత నిపుణులు 55 ముఖాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొన్నారు. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్ పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు. కాగా, అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ పేర్కొంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ వజ్రాన్ని.. ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్ లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని తెలిపిన సోతెబీ.. వేలంలో డబ్బుతో పాటు క్రిప్టోకరెన్సీని కూడా తీసుకుంటామని చెప్పింది. కాగా, వేలంలో ఈ వజ్రానికి కనీసం 50 లక్షల డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..