AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్.. ప్రయాణీకులు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటారంటే..

ప్యాసింజర్ రైలు మాత్రమే ఈ స్టేషన్‌లో ఆగుతుంది. అది కూడా రోజుకు ఆరు సార్లు. ఆదివారాల్లో, స్టేషన్‌కు రైళ్లు రానప్పుడు, స్టేషన్ మాస్టర్ వచ్చే వారం విక్రయానికి టిక్కెట్లు కొనుగోలు చేయడానికి బుర్ద్వాన్ నగరానికి వెళతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ విక్రయించే టిక్కెట్లపై పాత పేరు రాయ్‌నగర్ ఇప్పటికీ ముద్రించబడింది.

భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్.. ప్రయాణీకులు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటారంటే..
No Name Railway Station
Jyothi Gadda
|

Updated on: Feb 01, 2025 | 5:33 PM

Share

భారతీయ రైల్వేలను దేశానికే లైఫ్ లైన్ అంటారు. ఇది మన దేశంలోని చాలా ప్రాంతాలను కలుపుతుంది. ప్రతినిత్యం లక్షల మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. భారీ వస్తువుల నుంచి రోజువారి నిత్యవసరాల వరకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు ఒక ముఖ్యమైన వనరు. భారతదేశంలో చిన్న, పెద్ద స్టేషన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారిక పేరు లేని ఒక రైల్వే స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అంటే అది పేరులేని రైల్వే స్టేషన్. అది ఎక్కడుంది ఏంటా స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇలాంటి స్పెషల్ రైల్వే స్టేషన్ బుర్ద్వాన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక రైళ్లు, గూడ్స్ రైళ్లు ఈ రైల్వే స్టేషన్ గుండా వెళతాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి చాలా మంది ప్రయాణికులు రైలు ఎక్కడం, దిగడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ స్టేషన్‌ పేరును కనిపెట్టలేదు. 2008 నుండి ఈ రైల్వే స్టేషన్ పేరు లేకుండా నడుస్తోంది. ఈ స్టేషన్‌కు ఎందుకు పేరు రాలేదో తెలిసి కూడా ఆశ్చర్యపోతున్నారు.

దీనికి పేరు లేకపోవడానికి కారణం రెండు గ్రామాల మధ్య వివాదమే. రైనా, రాయినగర్ గ్రామాల మధ్య భూవివాదం ఉంది. 2008లో భారతీయ రైల్వే ఈ స్టేషన్‌ను నిర్మించినప్పుడు, దీనికి “రాయ్‌నగర్” అని పేరు పెట్టారు. అయితే స్థానిక ప్రజలు ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని మార్చాలని రైల్వే బోర్డును డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుంచి స్టేషన్‌ పేరు లేకుండానే నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

స్టేషన్‌కు ఇరువైపులా ఉన్న ఖాళీ పసుపు గుర్తు బోర్డులు ఈ వివాదాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ మొదటిసారి దిగిన ప్రయాణికులు తరచూ గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కడికి వచ్చారో సమీపంలోని వారిని అడిగి తెలుసుకున్నారు. బంకురా-మసగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే ఈ స్టేషన్‌లో ఆగుతుంది. అది కూడా రోజుకు ఆరు సార్లు. ఆదివారాల్లో, స్టేషన్‌కు రైళ్లు రానప్పుడు, స్టేషన్ మాస్టర్ వచ్చే వారం విక్రయానికి టిక్కెట్లు కొనుగోలు చేయడానికి బుర్ద్వాన్ నగరానికి వెళతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ విక్రయించే టిక్కెట్లపై పాత పేరు రాయ్‌నగర్ ఇప్పటికీ ముద్రించబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు