కూతురు తెచ్చిన అదృష్టం.. ఏకంగా పావుకేజీ బంగారం గెలుచుకున్న వ్యక్తి.. ఎక్కడంటే?
ఆడపిల్లను లక్ష్మిదేవిగా భావిస్తారు అందరూ.. ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే ఆ ఇంటికి అదష్టి పట్టినంటే అంటుంటారు.. ఇలాంటి విషయాలు కొందరు నమ్మకపోయినా.. సమాజంలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు అలాంటి మాటలకు నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే దుబాయ్లో వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన కుమార్తె రూపంలో ఏకంగా కోట్ల రూపాయల విలువైన బంగారం వరించింది.

ఓ వ్యక్తి ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న దక్కని ఫలితం.. తను కూతురి చేసిన ఒక్క ప్రయత్నంలోనే అతన్ని వరించింది. దుబాయ్లో నివసిస్తున్న ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి తన కుమార్తె రూపంలో అదష్టం వరించింది. తన కుమార్తెతో కొనిపించిన ఒక ల్యాటరీ అతనికి 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లి అనే వ్యక్తి దుబాయ్లో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్లిపోయిన ముంజునూథ్ గత 20 ఏళ్లగా అక్కడే జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే ముంజునాథ్ స్నేహితుల సలహాతో గతకొన్ని రోజులుగా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇలా ఇయన ఏడ సవంత్సరాలుగా కొంటునే ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఇతనికి ఎలాంటి అదృష్టం వరించలేదు. గతంలో ఒకసారి 1 నెంబర్తో తేడాతో దాదాపు 15 మిలియన్ దిరమ్ల జాక్పాట్ మిస్ అయ్యాడు. కానీ అతను నిరాశ చెందలేదు. ఈ సారి తన కుమార్తెతో ఒక టికెట్ను కొనిపించాడు. ఈ నిర్ణయమే అతన్ని ఏడేళ్ల నిరీక్షణను దూరం చేసింది. తన కుమార్తె కొన్న టికెట్ అతనికి పావుకిలో బంగారాన్ని గెలిచిపెట్టింది.
దీంతో మంజునాథ్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. నా కూతురు నా దృష్టం.. ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇంతటితో ఆపనని ఆయన అన్నారు.. ఆమె చేత మరిన్ని బిగ్ టికెట్స్ కొనుగోలు చేస్తానని చెప్పారు. ఈ గెలుపుతో తన కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
