AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కావేరి నీటి విడుదలతో గ్రామస్తుల సంబరాలు.. సోషల్ మీడియాను ముంచేసిన భావోద్వేగం..! ఏం చేశారంటే..

జలమే ప్రాణం... కావేరి నదీమ తల్లి తమ పరిసరాల్లోకి ప్రవహించగానే..అక్కడి ప్రజలు పండగ చేసుకున్నారు. భూమిని తాకిన నీళ్లను నుదిటికి అద్దుకున్నారు. మరి కొందరు హారతి పట్టారు. ఇలాంటి భావోద్వేగాలతో వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. కావేరీ నదికి లభించిన ఈ స్వాగతం తమిళనాడు భూమిని తడిపడమే కాకుండా, యావత్‌ దేశ ప్రజల హృదయాన్ని కూడా తడిపింది. ప్రకృతి, సంప్రదాయం కలిసినప్పుడు ప్రవహించేది కేవలం నీరు కాదు.. అది సంస్కారం అని ఈ వీడియో చెబుతుంది.

Watch: కావేరి నీటి విడుదలతో గ్రామస్తుల సంబరాలు.. సోషల్ మీడియాను ముంచేసిన భావోద్వేగం..! ఏం చేశారంటే..
Kaveri River Reaches
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2025 | 10:39 AM

Share

తమిళనాడులో వెలుగు చూసిన ఒక భావోద్వేగ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సాధారణ నీటి ప్రవాహం కాదు, ఇది కావేరి తల్లి రాక వేడుక… అక్కడి ప్రజలు పూల వర్షం కురిపించారు. చేతులెత్తి మొక్కులు తీర్చుకున్నారు. సంతోషంతో కళ్ళు తడిగా మారాయి. నదీ ప్రవాహం చూడగానే అందరి మనసులు సంతోషంతో నిండిపోయాయి. కావేరి డెల్టా ప్రాంతానికి నీటిపారుదల కోసం నీరు విడుదల చేశారు. ఈ క్రమంలోనే కావేరి నది నీరు ఎండిన భూమికి చేరుకున్నప్పుడు అక్కడి గ్రామస్తుల సంతోషం, సంబరాలు నిజంగా వెలకట్టలేనివి. కొందరు ఆ నీటిని తమ నుదిటికి అద్దుకుని ఆనందపడ్డారు. మరి కొందరు కర్పూర హారతి పట్టారు. ఇంకొందరు కన్నీళ్లతో కావేరీ మాతను తాకి నమస్కరించారు. ఈ అందమైన క్షణాన్ని IFS అధికారితో సహా చాలా మంది ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఇది అనేక హృదయాలను తాకుతోంది.

ఈ వీడియోను జూన్ 20న IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్) పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేశారు. ఆయన దీనికి నీరే ప్రాణం అనే క్యాప్షన్‌ ఇచ్చారు. కావేరీ మాత ప్రజల వద్దకు చేరుకున్నప్పుడు, వారు ఆనందంతో ఇలా పండగ జరుపుకున్నారు అంటూ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ Xలో వైరల్ అయింది. దీనికి ఇప్పటివరకు 1 లక్ష 53 వేల వ్యూస్‌, 6.9 వేల లైక్‌లు వచ్చాయి. వందలాది మంది వినియోగదారులు వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

వరదల నవీకరణలను అందించే టెక్నాలజీ ప్రొఫెషనల్ నవీన్ రెడ్డి కూడా ఈ వీడియోను షేర్ చేసి ఇలా రాశారు – కావేరి రాకతో ప్రజల హృదయాలు వికసించాయి.. ఇది కేవలం నీరు కాదు, ఇది భావోద్వేగం, సంప్రదాయం, అనుబంధం. అందుకే నేను వరదలు కాదు, భావోద్వేగాల ప్రవాహాన్ని చూస్తున్నాను. ఈ నీటితో సుమారు 13 లక్షల ఎకరాల పొలాలు సాగులోకి వస్తాయని చెప్పారు. అంటే, కావేరి మళ్ళీ జీవితంలా ప్రవహించడం ప్రారంభించింది అంటూ వ్యాఖ్యనించారు.

వీడియో ఇక్కడ చూడండి…

ఈ క్లిప్ చూసిన తర్వాత చాలా మంది తమ భావాలను వ్యక్తం చేశారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు – కావేరి తల్లి వచ్చింది. గ్రామస్తులు ఆమెను చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లిలాగా గౌరవంగా స్వీకరిస్తున్నారు. మన దేశంలో నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు. అవి దేవతలు, ప్రాణమిచ్చే తల్లులు. ఈ భావాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇది మన నిజమైన సంస్కృతి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..