AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ఖర్మరా బాబు.. మేనల్లుడితో పారిపోయిన అత్త.. పాపం ముగ్గురు పిల్లలతో..!

కాగా, సదరు మహిళకు 12 ఏళ్ల క్రితం జైరామ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వారి సమీపంలో ఉండే మేనల్లుడిని వివాహేతర సంబంధం ఏర్పడిందని భర్త వాపోయాడు. గత ఫిబ్రవరి నెలలో కూడా తన భార్య మేనల్లుడితో పారిపోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పుడు నాలుగు రోజుల తరువాత అతని భార్య దొరికిందని చెప్పాడు.

ఇదేం ఖర్మరా బాబు.. మేనల్లుడితో పారిపోయిన అత్త.. పాపం ముగ్గురు పిల్లలతో..!
Aunt fell in love with her nephew
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2025 | 10:04 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. గతంలో వదినా, మరిది ప్రేమ వ్యవహారం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అలాంటిదే మరో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అలీఘర్‌కు చెంది. ఓ అత్త తన మేనల్లుడితో ప్రేమలో పడింది. అది అంతటితో ఆగలేదు..ఏకంగా వారిద్దరూ కలిసి ఊరు వదిలి పారిపోయారు.. మేనల్లుడిపై ప్రేమతో భర్త, ముగ్గురు పిల్లలను కూడా వదిలి జంప్ అయింది.

అలీఘర్‌లోని హర్దువాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధాసి గ్రామంలో మేనల్లుడు తన అత్తతో పారిపోయాడు. అదే సమయంలో, మేనల్లుడు తన భార్యతో పారిపోయినందుకు మామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్త, మేనల్లుడి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా, సదరు మహిళకు 12 ఏళ్ల క్రితం జైరామ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వారి సమీపంలో ఉండే మేనల్లుడిని వివాహేతర సంబంధం ఏర్పడిందని భర్త వాపోయాడు. గత ఫిబ్రవరి నెలలో కూడా తన భార్య మేనల్లుడితో పారిపోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పుడు నాలుగు రోజుల తరువాత అతని భార్య దొరికిందని చెప్పాడు.

రెండు రోజుల క్రితం మరోసారి తన భార్య మేనల్లుడు తన ఇద్దరు కుమారులతో కలిపి పారపోయారంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య లేకపోయినా సరే.. తన ఇద్దరు పిల్లలు తిరిగి తన వద్దకు రప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..