AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zepto: ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. పట్టించుకోని సంస్థ

ఫోన్‌లో చార్జ్ లేదని, కొంచెం ఆర్జెంట్ చార్జ్ పెట్టుకోవాలని కోరాడు. దానికి యువతి ఒప్పుకోగా.. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాధిత యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Zepto: ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. పట్టించుకోని సంస్థ
Zepto
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2025 | 11:10 AM

Share

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం చేసిన ఘటన చెన్నైలోని కుబేరన్‌ నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగిని జెప్టోలో కిరాణా సామాగ్రి ఆడర్ పెట్టగా.. గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడు. ఫోన్‌లో చార్జ్ లేదని, కొంచెం ఆర్జెంట్ చార్జ్ పెట్టుకోవాలని కోరాడు. దానికి యువతి ఒప్పుకోగా.. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాధిత యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన మదిపక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇదిలా ఉంటే బాధితురాలు జరిగిన విషయాన్ని జెప్టో సంస్థకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ, సంస్థ తగిన చర్యలు తీసుకోలేదని, దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెప్టో నుంచి స్పందన రాకపోవడంతో ఐటీ ఉద్యోగిని నేరుగా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్‌ గోపీనాథ్‌ను అరెస్ట్‌ చేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..