టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్‌గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్‌ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్‌తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.

‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్‌కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్‌ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

ఇంకా చదవండి

Hyderabad: ఒకరు కాదు ఇద్దరు కాదు… సుమారు 50 మంది.. ఆర్టీసీ బస్సును ఆపి..

హైదరాబాద్ శివార్లలోని రాచలూరు గేటు వద్ద గురువారం RTC బస్సును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు ప్రజల సొత్తు అని, వాటిని కాపాడుకోవాల్సింది ప్రజలేనని సజ్జనార్ పేర్కొన్నారు. పోలీసు శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్లను కూడా తెరుస్తామని... బస్సు నష్టం ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు.

TSRTC: ఇక నో టెన్షన్.. ఏపీ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 140 సర్వీసులు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌ లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టినట్లు యాజమాన్యం తెలిపింది.

TSRTC: అబ్బ.. ఏం ఆఫర్ అన్నా.. 8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే..

సమ్మర్ వేళ వరుసపెట్టి ఆఫర్స్ ప్రకటిస్తుంది TSRTC. ప్రయాణీకులను గ్రాబ్ చేసేందుకు తన మార్క్ రాయితీలు ప్రకటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ - విజయవాడ మార్గాల గుండా వెళ్లేవారికి రాయితీ ఆఫర్ ప్రకటించారు. తాజాగా.. మరో బంఫర్ ఆఫర్ తీసుకొచ్చారు. అది ఏంటంటే..?

Telangana: హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

ఈ వేసవి కాలంలో విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఈ బస్సులలో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలియజేసింది. అంతేకాదు

అచ్చమైన సొంతూరి ఆవకాయ తినాలని ఉందా..? గుడ్‌న్యూస్ చెప్పిన TSRTC

ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త. టీఆఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయను డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా పంపించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా.?

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మంది బయటి పనులను ఉదయం పదికల్లా పూర్తి చేసుకుంటున్నారు. లేదా సాయంత్రానికి వాయిదా వేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో...

TSRTC: భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు..

ఇక కళ్యాణోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వీటికోసమే భద్రాచలం వెళ్లే వారు కూడా ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఇంట్లోనే ఉండి భద్రాద్రి రామయ్య తలంబ్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది. ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా దేవదాయ ధర్మాదయా...

Hyderabad: మహిళలకు మరో స్వీట్ న్యూస్.. ఇకపై ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఇప్పటి వరకు సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. కాగా.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపించింది రేవంత్ సర్కార్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. టీఎస్ ఆర్టీసీ కొత్తగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో కూడా....

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం PRC ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.

Tourists: టూరిస్టులు అలర్ట్.. ఆ రెండు పర్యాటక ప్రాంతాల్లోకి నో ఎంట్రీ, ఎందుకంటే..

ఫిబ్రవరి 21 నుంచి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం సరస్సులను ఫిబ్రవరి 26 వరకు సందర్శకుల కోసం మూసివేయనున్నారు. రెండు పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్, రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: వేసవి నేపథ్యంలో TSRTC గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఏసీ బస్సులు

గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కొత్త బస్సులను ప్రారంభించారు. TSRTC ఈ ఏడాది జూన్ నాటికి దశలవారీగా 1,325 కొత్త బస్సులను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులు ఉన్నాయి.

Hyderabad: బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ నయా ప్లాన్..

సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు. దీంతో ఇబ్బందులు ఎదురవతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్‌ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Telangana: త్వరపడండి.. ఇంటికే అమ్మవార్ల బంగారం.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒక పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

Telangana: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. అలాగే అందుబాటులోకి 100 కొత్త బస్సులు

ఆర్టీసీ కార్మికుల బకాయిలు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. కొత్తగా వంద బస్సులను ప్రారంభించడంతో పాటు.. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి 535 కోట్ల చెక్కును ఆర్టీసీ ఎండీకి అందించారు. మహాలక్ష్మీ పథకంలో రోజుకు ప్రభుత్వంపై రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 కోట్ల భారం పడినా.. వెనకడుగు వేయకుండా ముందుకుసాగుతున్నామని రేవంత్ చెప్పారు.

TSRTC: పురుషులకు గుడ్‌న్యూస్.! ఇకపై బస్సుల్లో కావలసినన్ని సీట్లు.. వివరాలు ఇవిగో

మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పురుషులు పలు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.