AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీఎస్ఆర్టీసీ

టీజీఎస్ఆర్టీసీ

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్‌గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్‌ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్‌తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.

‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్‌కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్‌ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

ఇంకా చదవండి

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత.. నిప్పంటించుకుని డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం..

ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేటలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులు.. శంకర్‌గౌడ్‌ను ఎంజీఎంకు తరలించారు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..

టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రో శుభవార్త అందించింది. నగరంలో మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. ప్రతీ మూడు నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ తిప్పనున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల బంద్ క్రమంలో మెట్రోకు డిమాండ్ పెరిగింది.

TGSRTC: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న పురుషులు..

తెలంగాణ ఆర్టీసీ సమ్మె క్రమంలో బస్సుల్లో పురుషులు టికెట్లు తీసుకోవడం లేదు. కండక్టర్లు లేకపోవడంతో టికెట్ తీసుకోకుకండా ఫ్రీ జర్నీ చేస్తున్నారు. డ్రైవర్ల దగ్గరికి వెళ్లి టికెట్లు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రూట్లలో ప్రైవేట్ డ్రైవర్లతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!

తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుంది. బస్సులు నిలిచిపోనున్నాయని సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరపగా.. అవి విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టడం తప్పడం లేదని చెబుతున్నారు.

TGSRTC: ఏపీలో తిరిగే టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మారిన ఛార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే.. ప్రయాణికులకు ఊరట..

ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మీదుగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు సర్వీసులు అందిస్తున్నాయి. వీటిల్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల కంటే టికెట్ రేట్లు అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రయాణికుల నుంచి వినతులు రావడంతో ఛార్జీలను అధికారులు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరే శుభవార్త.. ప్రభుత్వం నుంచి బిగ్ రిలీఫ్.. తప్పనున్న కష్టాలు..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త అందించింది టీజీఎస్‌ఆర్టీసీ. ఎలక్ట్రిక్ బస్సులను మెట్రో స్టేషన్ల వద్ద ప్రవేశపెట్టనుంది. త్వరలోనే ఇవి రోడ్డెక్కనున్నాయని తెలుస్తోంది. వీటి కోసం ఎక్కడిక్కడ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ అవుతుంది.

Telangana: ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ ఇయర్ నుండి డీఏను 2.1శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా ప్రభుత్వం నిర్ణయంతో ఇంతకు ముందు 50.7 శాతం ఉన్న DA ఇపుడు 52.8శాతానికి పెరగనుంది. ఈ పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు.

  • Anand T
  • Updated on: Apr 10, 2026
  • 11:45 am

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై మరో ప్రకటన చేసింది. నగరంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తోంది. అలాగే వీటి కోసం మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. నగరంలో మరో 13 స్టేషన్లను నెలకొల్పనుంది.

TGSRTC: ఎంజీబీఎస్, జేబీఎస్ తరహాలో హైదరాబాద్‌లో మరో భారీ బస్ టెర్మినల్.. ఎక్కడంటే..?

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ టెర్మినల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తరచూ వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఈ బస్ టెర్మినల్ నుంచి తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే నగరంలో మరో పెద్ద బస్ టెర్మినల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

Women Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు మరో గుడ్ న్యూస్.. చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులు.. అప్పటినుంచే..

మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రేవంత్ సర్కార్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు అవసరం లేకుండా మహిళలకు ఉచితంగా స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది.

TGSRTC: శ్రీరామనవమి సందర్భంగా ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు.. జస్ట్ ఒక్క దూరంలో..

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు జారీ చేసింది. శ్రీరామనమి సందర్భంగా అద్బుత అవకాశం కల్పిస్తోంది. భద్రాచలం స్వామివారి కళ్యాణ్ తలంబ్రాలు ఇంటి వద్ద ఉండే పొందచ్చు. ఆర్డర్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ డోర్ డెలివరీ చేసేలా లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు

హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు తయారీ కంపెనీలకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 2 వేల బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు మరో 200 బస్సులకు ఆమోదం లభించింది. ఈ వివరాల్లోకి వెళ్తే..

ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
జీవితంలో మళ్లీ అతడితో అస్సలు పని చేయొద్దు అనుకున్నా..
జీవితంలో మళ్లీ అతడితో అస్సలు పని చేయొద్దు అనుకున్నా..