టీజీఎస్ఆర్టీసీ
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్అండ్బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.
‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే డ్రైవర్కు సలామ్ చేయాల్సిందే..
కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా ఓ మహిళ స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సకాలంలో చికిత్స అందించి మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jul 6, 2026
- 3:25 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ 5 మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. సాఫీగా జర్నీ..
హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నగరంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా మరికొన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- Venkatrao Lella
- Updated on: Jun 24, 2026
- 10:36 am
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే సూపర్ న్యూస్.. సిటీ బస్సుల కోసం కొత్త వ్యవస్థ.. ఇక రయ్.. రయ్..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే సిటీ బస్సుల కోసం ప్రత్యేక కారిడార్ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దీని వల్ల సిటీలో రవాణా మెరుగుపడుతుంది.
- Venkatrao Lella
- Updated on: Jun 6, 2026
- 4:13 pm
TGSRTC: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ముగిసిన డిస్కౌంట్.. అమల్లోకి పాత ఛార్జీలు!
హైదరాబాద్లోని ఆర్టీసి ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు చేసింది. సమ్మర్ ఎండల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశ పెట్టిన డిస్కౌంట్ ఆఫర్ మే 30తో ముగిసిందని.. దీంతో జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత ఛార్జీలు తిరిగి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
- Anand T
- Updated on: May 30, 2026
- 8:36 pm
TGSRTC: డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి.
- Venkatrao Lella
- Updated on: May 26, 2026
- 11:27 am
Telangana: ఆ ప్రచారం అవాస్తవం.. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్
డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు.. ప్రాణాలు తీసుకొనేందుకూ వెనుకాడట్లేదు నర్సంపేట బస్ డిపోలో డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. MGMలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్గౌడ్ను హైదరాబాద్కు తరలించి కంచన్ బాగ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
- Krishna S
- Updated on: Apr 24, 2026
- 1:01 am
TGSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు ఎలా అంటే..?
తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటోది. కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిపోల మేనేజర్లను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవాలి.
- Venkatrao Lella
- Updated on: Apr 23, 2026
- 9:41 pm
TGSRTC: ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత.. నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులు.. శంకర్గౌడ్ను ఎంజీఎంకు తరలించారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 23, 2026
- 4:59 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..
టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రో శుభవార్త అందించింది. నగరంలో మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. ప్రతీ మూడు నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ తిప్పనున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల బంద్ క్రమంలో మెట్రోకు డిమాండ్ పెరిగింది.
- Venkatrao Lella
- Updated on: Apr 22, 2026
- 4:48 pm
TGSRTC: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న పురుషులు..
తెలంగాణ ఆర్టీసీ సమ్మె క్రమంలో బస్సుల్లో పురుషులు టికెట్లు తీసుకోవడం లేదు. కండక్టర్లు లేకపోవడంతో టికెట్ తీసుకోకుకండా ఫ్రీ జర్నీ చేస్తున్నారు. డ్రైవర్ల దగ్గరికి వెళ్లి టికెట్లు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రూట్లలో ప్రైవేట్ డ్రైవర్లతో టీజీఎస్ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.
- Venkatrao Lella
- Updated on: Apr 22, 2026
- 4:34 pm
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుంది. బస్సులు నిలిచిపోనున్నాయని సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరపగా.. అవి విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టడం తప్పడం లేదని చెబుతున్నారు.
- Venkatrao Lella
- Updated on: Apr 21, 2026
- 4:26 pm
TGSRTC: ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మారిన ఛార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే.. ప్రయాణికులకు ఊరట..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మీదుగా టీజీఎస్ఆర్టీసీ బస్సులు సర్వీసులు అందిస్తున్నాయి. వీటిల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కంటే టికెట్ రేట్లు అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రయాణికుల నుంచి వినతులు రావడంతో ఛార్జీలను అధికారులు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Apr 14, 2026
- 8:26 am