టీజీఎస్ఆర్టీసీ
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్అండ్బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.
‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
Women Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు మరో గుడ్ న్యూస్.. చిప్తో కూడిన స్మార్ట్ కార్డులు.. అప్పటినుంచే..
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రేవంత్ సర్కార్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు అవసరం లేకుండా మహిళలకు ఉచితంగా స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది.
- Venkatrao Lella
- Updated on: Mar 29, 2026
- 9:08 pm
TGSRTC: శ్రీరామనవమి సందర్భంగా ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు.. జస్ట్ ఒక్క దూరంలో..
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు జారీ చేసింది. శ్రీరామనమి సందర్భంగా అద్బుత అవకాశం కల్పిస్తోంది. భద్రాచలం స్వామివారి కళ్యాణ్ తలంబ్రాలు ఇంటి వద్ద ఉండే పొందచ్చు. ఆర్డర్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ డోర్ డెలివరీ చేసేలా లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.
- Venkatrao Lella
- Updated on: Mar 25, 2026
- 7:13 pm
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు
హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు తయారీ కంపెనీలకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 2 వేల బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు మరో 200 బస్సులకు ఆమోదం లభించింది. ఈ వివరాల్లోకి వెళ్తే..
- Venkatrao Lella
- Updated on: Mar 19, 2026
- 8:01 am
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఈ బస్సుల్లో ఛార్జీలు పెంపు.. ఏకంగా 50 శాతం..
టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఉగాది సెలవులకు చాలమంది తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
- Venkatrao Lella
- Updated on: Mar 18, 2026
- 8:13 am
Telangana: ప్రయాణికులకు సూపర్ గుడ్న్యూస్.. ఉగాది, రంజాన్కు ఆ రూట్లలో ప్రత్యేక బస్సులు!
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగ సెలవులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది.
- Anand T
- Updated on: Mar 16, 2026
- 3:35 pm
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. త్వరలో మరిన్ని సిద్దం..
టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో 200 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీని వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందనుంది. మహిళా సంఘాలు ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నాయి. ఇప్పటికే బాడీ బిల్డింగ్ పూర్తయ్యాయి.
- Venkatrao Lella
- Updated on: Feb 26, 2026
- 9:22 pm
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. టికెట్ల ఛార్జీలను భారీగా తగ్గించింది. ఏసీ బస్సుల్లో ఒకేసారి ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఛార్జీలు మార్చి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్లోని ఏసీ బస్సులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది.
- Venkatrao Lella
- Updated on: Feb 26, 2026
- 4:32 pm
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వెయ్యికిపైగా బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. వీటి రాకతో బస్సుల్లో రద్దీ భారీగా తగ్గనుంది. దీని వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేసే వెసులుబాటు లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 24, 2026
- 7:57 pm
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మీ సేవ యాప్తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. బస్ పాస్లు కూడా..
టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ నాగిరెడ్డి మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 24, 2026
- 7:33 pm
Telangana: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఛార్జీలు ఏకంగా 30 శాతం తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు..
సమ్మర్ మొదలవుతోంది. దీంతో ఏసీ బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గించింది.
- Venkatrao Lella
- Updated on: Feb 18, 2026
- 12:44 pm
TGSRTC: భక్తులకు గుడ్న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 11, 2026
- 3:15 pm
TGSRTC: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు.. వీరికి కూడా బస్సు సౌకర్యం
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలను అందిరికీ అందించేందుకు కొత్త బస్ స్టేషన్లు, డిపోల నిర్మాణం చేపడుతోంది టీజీఎస్ఆర్టీసీ. రవాణా సేవలను విస్తరించడంలో భాగంగా వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటి వివరాల్లోకి వెళ్తే..
- Venkatrao Lella
- Updated on: Feb 4, 2026
- 12:34 pm