టీజీఎస్ఆర్టీసీ
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్అండ్బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.
‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
Telangana: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు షురూ..
టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణతో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. కొత్తగా 65 ఈవీ బస్సులను మంత్రి పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 810 ఈవీ బస్సులతో పర్యావరణ పరిరక్షణలో టీజీఆర్టీసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. భద్రత, ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాయి.
- Krishna S
- Updated on: Dec 10, 2025
- 5:47 pm
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త… టికెట్ బుకింగ్లో కీలక మార్పులు..
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టీసీ.. టికెట్ల రిజర్వేషన్కు సంబంధించి కీలక మార్పులు చేసింది. జర్నీకి రెండు నెలలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం
- Venkatrao Lella
- Updated on: Dec 2, 2025
- 12:21 pm
KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు ఉచిత బస్సు పథకం పేరుతో పురుషులు, విద్యార్థుల నుంచి రెండింతలు వసూలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని కేటీఆర్ విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ, చార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
- Phani CH
- Updated on: Oct 7, 2025
- 5:30 pm
TGSRTC: పండగకు ఊరెళ్ల వారికి గుడ్న్యూస్.. బతుకమ్మ, దసరాకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే?
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను బస్సులను నడపపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ తాజాగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
- Anand T
- Updated on: Sep 18, 2025
- 5:41 pm
TGSRTC Jobs 2025: నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!
TGSRTC Job Notification for 1743 Driver and Shramik Posts: రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ను బుధవారం (సెప్టెంబర్ 17) విడుదల చేసింది. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది..
- Srilakshmi C
- Updated on: Sep 17, 2025
- 5:41 pm
VC Sajjanar: ఇక ఆటాడితే అడ్డంగా బుక్కైనట్లే.. యువత భవిష్యత్కు బంగారు బాట: సజ్జనార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఆన్లైన్ బెట్టింగ్యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ను నియంత్రించడానికి, అలాగే చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెడీ అయింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆటలు ఆడితే భారీగా జరిమానాలు విధించడంతోపాటు.. ప్లాట్ఫాంను నిషేధిస్తారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 20, 2025
- 12:32 pm
Watch Video: ఆర్టీసీ కండక్టర్పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!
ఈ మధ్య ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై ప్రయాణికులు దాడులు చేస్తున్న ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం.. తాగాజా ఇలాంటి ఘటనే హైదాబాద్లో మరోసారి వెలుగు చూసింది. మహిళా బస్సు కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడికి పాల్పడింది. ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Anand T
- Updated on: Aug 17, 2025
- 10:57 am
TSRTC: తక్కువ ధరకే పాండురంగడు, మహా లక్ష్మి సహా ప్రముఖ క్షేత్రాల దర్శనం.. టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటన
శ్రీ మహా లక్ష్మి కొలువైన క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటి కొల్హాపూర్. పంచగంగ నదీ తీరాన ఉన్న ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఇక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా, శక్తిరూపంగా భక్తులతో పూజలను అందుకుంటుంది. అటువంటి విశేష ప్రాముఖ్యత ఉన్న కొల్హాపూర్ కి వెళ్ళాలనుకునే భక్తులకు తెలంగాణా RTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ రోజు ఈ టూర్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
- Surya Kala
- Updated on: Jul 14, 2025
- 11:09 am
TGSRTC: ఆర్టీసీ బస్సులో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోనకు చెందిన వెంకటేశ్వర్లును టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 29, 2025
- 9:01 am
Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఇలా..
తెలంగాణ ఆర్టీసీలో 3 వేల 38 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడదల చేయనుంది ప్రభుత్వం. పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ డ్రైవర్లతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొత్తబస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందన్నారు పొన్నం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Apr 20, 2025
- 11:12 am
TGSRTC: బస్సులో జన్మించిన ఆ పాపకు బంపర్ ఆఫర్.. లైఫ్ లాంగ్ ఫ్రీ బస్ పాస్
మణుగూరు డిపోకు చెందిన బస్సులో గత ఏడాది డిసెంబర్ 21న ప్రయాణికురాలి 10 తులాల బంగారు అభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె విలపిస్తూ పీహెచ్బీ డ్రైవర్ కోటేశ్వరరావుకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును భద్రాచలం బస్ స్టేషన్ లో ఆపి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 5, 2025
- 5:40 pm
Hyderabad: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీస్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమన్యానికి 21 డిమాండ్లతో సమ్మెనోటీసులిచ్చాయి కార్మికసంఘాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. తెలంగాణలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Ravi Kiran
- Updated on: Jan 27, 2025
- 7:16 pm