టీజీఎస్ఆర్టీసీ
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్అండ్బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.
‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
ఇంకా చదవండిSpecial Buses: భక్తులకు గుడ్న్యూస్.. హైదరాబాద్లోని ఈ రూట్లో ప్రత్యేక బస్సులు!
TGSRTC special buses: హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ మండపాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది.
- Anand T
- Updated on: Sep 13, 2026
- 8:14 am
Hyderabad: అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు.. స్టాప్ల వివరాలివే..
హైదరాబాద్లో అర్ధరాత్రి ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆరు ప్రధాన రూట్లలో నడుస్తున్న ఈ సర్వీసులకు మంచి స్పందన లభిస్తోంది. కోఠి–పటాన్చెరు, అఫ్జల్గంజ్–పటాన్చెరు, సికింద్రాబాద్–పటాన్చెరు, హయత్నగర్–సికింద్రాబాద్ తదితర రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రాంతాల వారీగా స్టాప్లు, ట్రిప్పులు, ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవే.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 8, 2026
- 5:46 pm
TGSRTC: మెట్రో తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు.. ప్రయాణికులకు ఆ సమస్య తీరినట్లే..
టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులను మెట్రో తరహాలోనే తీర్చిదిద్దనుంది. ఇందుకోసం బస్సుల్లో అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. బస్సుల్లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో సమాచారంతో పాటు వాణిజ్య ప్రకటనలను ప్రదర్శించనుంది. ప్రస్తుతం కొన్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
- Venkatrao Lella
- Updated on: Sep 1, 2026
- 3:12 pm
TGSRTC: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఆర్టీసీ బస్సులు.. టైమింగ్స్ ఇవే..
హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రాత్రిపూట కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రూట్, టైమింగ్స్ వివరాలను టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. నైట్ షిప్టులకు వెళ్లేవారికి ఊరట కలిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
- Venkatrao Lella
- Updated on: Aug 29, 2026
- 4:30 pm
TGSRTC: ప్రయాణికులకు గుడ్న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు.. ఎప్పటివరకంటే?
రాఖీ పౌర్ణమి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పండగ రద్దీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 27, 2026
- 8:48 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అర్ధరాత్రి తర్వాత కూడా ఆర్టీసీ బస్సులు.. తొలుత ఈ రూట్లల్లో..
హైదరాబాద్లోని టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కూడా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ రద్దీ రూట్లల్లో వీటిని నడపనుంది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని రూట్లలో నడపనుండగా.. అనంతరం మిగతా రూట్లల్లో ప్రవేశపెట్టనుంది.
- Venkatrao Lella
- Updated on: Aug 25, 2026
- 4:16 pm
ట్రెండ్ మారింది గురూ..! బస్టాండ్లో అందరిచూపు ఆ బోర్డుపైనే..
సూర్యాపేట కొత్త ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను గౌరవించాలనే సందేశాలు కనిపించగా.. తాజాగా **“పురుషులను గౌరవించండి”** అంటూ కనిపించిన బోర్డు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే దీని ఉద్దేశం పురుషులకు మాత్రమే ప్రత్యేక గౌరవం ఇవ్వడం కాదని అధికారులు చెబుతున్నారు.
- M Revan Reddy
- Updated on: Aug 13, 2026
- 4:27 pm
TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే డ్రైవర్కు సలామ్ చేయాల్సిందే..
కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా ఓ మహిళ స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సకాలంలో చికిత్స అందించి మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jul 6, 2026
- 3:25 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ 5 మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. సాఫీగా జర్నీ..
హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నగరంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా మరికొన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- Venkatrao Lella
- Updated on: Jun 24, 2026
- 10:36 am
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే సూపర్ న్యూస్.. సిటీ బస్సుల కోసం కొత్త వ్యవస్థ.. ఇక రయ్.. రయ్..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే సిటీ బస్సుల కోసం ప్రత్యేక కారిడార్ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దీని వల్ల సిటీలో రవాణా మెరుగుపడుతుంది.
- Venkatrao Lella
- Updated on: Jun 6, 2026
- 4:13 pm
TGSRTC: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ముగిసిన డిస్కౌంట్.. అమల్లోకి పాత ఛార్జీలు!
హైదరాబాద్లోని ఆర్టీసి ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు చేసింది. సమ్మర్ ఎండల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశ పెట్టిన డిస్కౌంట్ ఆఫర్ మే 30తో ముగిసిందని.. దీంతో జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత ఛార్జీలు తిరిగి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
- Anand T
- Updated on: May 30, 2026
- 8:36 pm
TGSRTC: డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి.
- Venkatrao Lella
- Updated on: May 26, 2026
- 11:27 am