AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీఎస్ఆర్టీసీ

టీజీఎస్ఆర్టీసీ

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం వేర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ పరిధిలో మూడు జోన్లు, 97 డిపోలు ఉన్నాయి. అలాగే రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రయాణీకులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇదిలా ఉండగా.. 2023, జూలై 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో వీలనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభలో ఆమోదం లభించింది. అనంతరం వివరణలు, స్పందనలు.. ఇలా పలు కీలక అంశాలు జరిగిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 14న ఆర్టీసీ సిబ్బంది అఫీషియల్‌గా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జీరో టికెట్ సర్వీస్‌ను సైతం అమలులోకి తెచ్చింది. ఈ టికెట్ సౌకర్యంతో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు తెలంగాణ బోర్డర్ వరకు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చు.

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి వీలనం చేయాలన్న డిమాండ్‌తో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఇక ఆ సమయంలో కార్మికులు విన్నవించిన కోరిక మేరకు.. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. సత్వరమే ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించింది.

‘ఆర్టీసీ-వీలనం’ ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై నుంచి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆగష్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్లును రాజ్ భవన్‌కు పంపించింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది. ఇక గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో.. ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్‌ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై ఆగష్టు 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించింది. ఆగష్టు 6 మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ ఆమోదం పొందిన వెంటనే.. అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబర్ 14న తుది ఆమోదం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

ఇంకా చదవండి

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. త్వరలో మరిన్ని సిద్దం..

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో 200 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీని వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందనుంది. మహిళా సంఘాలు ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నాయి. ఇప్పటికే బాడీ బిల్డింగ్ పూర్తయ్యాయి.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?

ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. టికెట్ల ఛార్జీలను భారీగా తగ్గించింది. ఏసీ బస్సుల్లో ఒకేసారి ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఛార్జీలు మార్చి 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏసీ బస్సులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వెయ్యికిపైగా బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. వీటి రాకతో బస్సుల్లో రద్దీ భారీగా తగ్గనుంది. దీని వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేసే వెసులుబాటు లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మీ సేవ యాప్‌తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. బస్ పాస్‌లు కూడా..

టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ నాగిరెడ్డి మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

Telangana: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఛార్జీలు ఏకంగా 30 శాతం తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు..

సమ్మర్ మొదలవుతోంది. దీంతో ఏసీ బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గించింది.

TGSRTC: భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.

TGSRTC: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు.. వీరికి కూడా బస్సు సౌకర్యం

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలను అందిరికీ అందించేందుకు కొత్త బస్ స్టేషన్లు, డిపోల నిర్మాణం చేపడుతోంది టీజీఎస్ఆర్టీసీ. రవాణా సేవలను విస్తరించడంలో భాగంగా వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటి వివరాల్లోకి వెళ్తే..

TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. గోవా వెళ్లాలనుకునేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం 5 వేల ధరతో చవకైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో గోవానే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Medaram Jatara: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ్యత సంపాదించుకున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్దంమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

TGSRTC: గోవా, శ్రీశైలం, అరుణాచలం లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ తీపికబురు.. చౌక ధరకే టూర్..

గోవా వెళ్లాలనుకుంటున్నాారా..? శ్రీశైలం, అరుణాచలం, మేడారం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ టూర్ ధరలు చాలా తక్కువా ఉన్నాయి. వీటి ధర ఎంత.. ఇతర వివరాలు తెలుసుకుందాం.

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ ద్వారా ఇంటికే ప్రసాదం.. ఇలా బుక్ చేస్కోండి

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడింది. మరో కొద్ది రోజుల్లో జాతర మొదలు కానుంది. ఈ జాతర కోసం భక్తులందరూ ఎదురుచూస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో..

Sankranti Special Buses: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు ఎలా ఉంటాయంటే..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.