Telangana: వేధిస్తున్నాడని యువకుడిని దారుణంగా చంపిన యువతి.. చేతులు కట్టేసి కత్తితో..
ములుగు జిల్లా ఏటూరునాగారంలో పండుగపూట దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించాలని వేధిస్తున్న యువకుడిని.. ఓ యువతి దారుణంగా పొడిచి చంపింది.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో పండుగపూట దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించాలని వేధిస్తున్న యువకుడిని.. ఓ యువతి దారుణంగా పొడిచి చంపింది. చేతులు కట్టేసి మరి కత్తితో అటాక్ చేసింది. ఈ దారుణ ఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగరం మండలం ఎర్రలవాడలో జరిగింది.
శ్రీను(30) అనే వ్యక్తి తనను ప్రేమించాలని వేధింపులకు పాల్పడుతుండటంతో అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి.. అతని చేతులు కట్టి కత్తితో పొడిచి చంపింది. హత్య అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.
ముందుగా శ్రీను చేతులను కట్టేసిని యువతి.. అనంతరం కత్తితో పొడిచింది. దీంతో కొంతసేపటికే శ్రీను మరణించాడు. శ్రీను మృతదేహాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఈ షాకింగ్ ఘటనతో ములుగు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు యువతి శ్రీనును ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఎలా చేతులు కట్టేసింది అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..