AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాంత్రికపూజల నెపంతో మహిళ సజీవదహనం.. ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్థులు

మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న నేపంతో గ్రామస్థులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బతికుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది..

Telangana: తాంత్రికపూజల నెపంతో మహిళ సజీవదహనం.. ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్థులు
Woman Burnt Alive By Villagers
P Shivteja
| Edited By: |

Updated on: Oct 04, 2024 | 8:06 PM

Share

రామాయంపేట, అక్టోబర్‌ 4: మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న నేపంతో గ్రామస్థులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బతికుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

మెదక్‌ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో ద్యాగల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఆమె తాంత్రిక పూజలు చేస్తుందని, మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందన్న నెపంతో ముత్తవ్వ ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. పోలీసులు హుటాహుటీన అక్కడకు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థుల దాడి భయంతో అదే ఇంట్లో బాధితురాలితోపాటు ఉంటున్న ఆమె కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోఘటన: మేడ్చల్‌ జిల్లాలోని చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మూడుచింతలపల్లి మండలం కొల్తూరులో చెరువు ఇటీవల కురుసిన వర్షాలకు నిండుకుండలా ఉంది. అందులో ప్రమాదవశాత్తు పడిపోయిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హర్ష, మణికంఠ, మనోజ్‌గా గుర్తించారు. వీరంతా 15 ఏళ్లలోపు బాలురు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం