Telangana: ఆ కుర్రాడికి 20, ఆమెకు 28 ఏళ్లు.. కట్ చేస్తే, ఇద్దరూ పంట పొలాల్లో..

ఆమెకి 28 ఏళ్లు.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో భర్తతో విబేధాలు రావడంతో పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో 20 ఏళ్ల కుర్రాడికి దగ్గరైంది.. ఈ క్రమంలో వారిద్దరి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది.

Telangana: ఆ కుర్రాడికి 20, ఆమెకు 28 ఏళ్లు.. కట్ చేస్తే, ఇద్దరూ పంట పొలాల్లో..
Double Murder
Follow us

|

Updated on: May 01, 2023 | 11:10 AM

ఆమెకి 28 ఏళ్లు.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో భర్తతో విబేధాలు రావడంతో పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో 20 ఏళ్ల కుర్రాడికి దగ్గరైంది.. గత కొతకాలంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారిద్దరి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది. జంట హత్యల షాకింగ్ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. పోలాల్లో రెండు గుడిహత్నూర్‌ మండలంలోని సీతాగోంది శివారులోని పొలాల్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ రెండు మృతదేహాలు.. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్‌ (20), కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్విని (28) గా గుర్తించారు.

అయితే, అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థలతో భర్తతో విడిపోయి కొన్ని నెలలుగా పుట్టింట్లో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఆమెకు రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉందని.. దీంతోనే ఈ హత్యలు జరిగినట్లుగా పేర్కొంటున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్‌ నుంచి సీతాగోందిలో శివారు పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు పంటపొలాల్లోకి వెళ్లిన తర్వాత హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ హత్యలు అశ్విని భర్త తరఫు వాళ్లే చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగేందర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..