AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో! చూడ్డానికి ఇలా ఉంది కానీ పెద్ద నంగనాచి.. భర్తను చంపి కొత్తింట్లో పాతి పెట్టేసింది

ఏ క్రైమ్ కహానికి లీడ్ వెతికినా తేలేది అక్రమ సంబంధమే. తాజాగా ఓ వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ కూడా అలాంటి క్లైమాక్స్‌కే తెరతీసింది. వివాహిత ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసింది.

Telangana: వామ్మో! చూడ్డానికి ఇలా ఉంది కానీ పెద్ద నంగనాచి.. భర్తను చంపి కొత్తింట్లో పాతి పెట్టేసింది
Wife Kills Husband
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2022 | 1:48 PM

Share

Crime News: అక్రమ సంబంధాలన్నీ హత్యలతో, ఆత్మహత్యలతో ముగియడం పరిపాటిగా మారింది. తాజాగా కామారెడ్డి జిల్లా(kamareddy district) ఎల్లారెడ్డి(yellareddy)లో వెలుగుచూసిన హత్య మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. చూడటానికి అమాయకంగా కనిపించే మహిళ ప్రియుడి సాయంతో భర్తను హత్యచేసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల రమేశ్‌ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రమేశ్‌ భార్య పేరు వెన్నెల, ఆమె వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వికారాబాద్‌కు చెందిన దస్తప్ప అనే వ్యక్తితో రమేశ్‌ భార్యకు అక్రమ సంబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన వెన్నెల, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది.

ఎనిమిది రోజుల క్రితం హత్య జరిగినట్టు తెలుస్తోంది. భర్తను చంపి నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే పాతి పెట్టారు. పోలీసుల విచారణలో భార్య, ప్రియుడు హత్య చేసినట్టు అంగీకరించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఆ ఇంట్లో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు. నిందితులిద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..