AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఊబిలో చిక్కుకున్న గుర్రం.. రక్షించేందుకు వెళ్లి గుర్రం సహా ఇద్దరు యువకులు మృతి..

నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది. గుర్రం ఊబిలో చిక్కుకోవడంతో రక్షించేందుకు అశు సింగ్ వెళ్ళాడు. అంతేకాదు సహాయం కోసం కేకలు వేయడంతో కాపాడేందుకు వెళ్లిన హార్స్ రైడింగ్ సెంటర్ ఓనర్ అజమ్ కొడుకు సైఫ్ కూడా వెళ్ళాడు. 

Hyderabad: ఊబిలో చిక్కుకున్న గుర్రం.. రక్షించేందుకు వెళ్లి గుర్రం సహా ఇద్దరు యువకులు మృతి..
Hyderabad
Surya Kala
|

Updated on: Apr 27, 2023 | 7:06 AM

Share

హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్‌ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వాగులో చోటుచేసుకుంది.

తెలంగాణ హార్స్ రైడింగ్ పేరుతో అజమ్ అనే వ్యక్తి.. హార్స్ రీడింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఈ హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు అసుసింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. రాజస్థాన్‌కు చెందిన అసుసింగ్, కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అనే ఇద్దరి యువకులు గుర్రం పై హార్స్‌ రేసింగ్ చేసుకుంటూ కిస్మత్పూర్ వైపు వెళుతుండగా… అక్కడ ఉన్న నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది.

గుర్రం ఊబిలో చిక్కుకోవడంతో రక్షించేందుకు అశు సింగ్ వెళ్ళాడు. అంతేకాదు సహాయం కోసం కేకలు వేయడంతో కాపాడేందుకు వెళ్లిన హార్స్ రైడింగ్ సెంటర్ ఓనర్ అజమ్ కొడుకు సైఫ్ కూడా వెళ్ళాడు.  అసుసింగ్, సైఫ్ ఇద్దరు యువకులు వాగులోకి దిగారు. మునిగిపోతున్న గుర్రాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల వాగులో గల్లంతైయ్యారు.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. రాజేంద్రనగర్ నాలాలో గుర్రంతో సహా నీటిలో మునిగి చనిపోయిన సైఫ్, ఆసుసింగ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గుర్రంతో పాటు ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు. పోస్టుమార్టం నిర్వహించారు.

REPORTER: SRAVAN

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం