AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: రోడ్డెక్కిన తెలంగాణ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఛార్జీ ఎంతో తెలుసా.?

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త సర్వీసులను లాంచ్‌ చేస్తూ వస్తోన్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ బస్సులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు బస్సులకు..

TSRTC: రోడ్డెక్కిన తెలంగాణ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఛార్జీ ఎంతో తెలుసా.?
Tsrtc
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2023 | 3:15 PM

Share

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త సర్వీసులను లాంచ్‌ చేస్తూ వస్తోన్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ బస్సులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు బస్సులకు పోటీగా ఆధునిక హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరుల సమక్షంలో ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఈ బస్సులను ఆర్టీసీ.. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి. తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నడపనున్నారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15తో మొత్తం 30 బెర్తులు ఉన్నాయి. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ బస్సుల్లో ఫ్రీ వైఫైతో పాటు మొబైల్‌ చార్జింగ్‌, ప్రతీ బెర్త్‌ వద్ద రీడింగ్‌ ల్యాంప్‌ వంటి ఫీచర్లు అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా, సెక్యూరిటీ కెమెరాలను అందించారు. బస్సులో మంటలు చెలరేగితే అప్రమత్తం చేసే.. ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ అలారం సిస్టంను ఏర్పాటు చేశారు.

ధరలు ఇలా ఉండనున్నాయి..

బీహెచ్‌ఈఎల్ నుంచి తిరుపతికి రూ.1750, ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి రూ.1690, మియాపూర్ నుంచి బెంగళూరుకు రూ.1630, ఎంజీబీఎస్ నుంచి బెంగళూరుకు రూ.1580, మియాపూర్ నుంచి హుబ్బళ్లికి రూ.1510, ఎంజీబీఎస్ నుంచి హుబ్బళ్లికి రూ.1460, బీహెచ్‌ఈఎల్ నుంచి విశాఖపట్నాకి రూ.1920, ఎంజీబీఎస్ నుంచి విశాఖపట్నానికి రూ.1860, బీహెచ్‌ఈఎల్ నుంచి చెన్నై రూ.1910, ఎంజీబీఎస్ నుంచి చెన్నై రూ.1860గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?