AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీఎస్‌పీఎస్‌సి పేపర్ లీక్ కేసులో దూకుడు పెంచిన సిట్.. రాజశేఖర్ స్వగ్రామంలో విచారణ..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తుని ముమ్మరం చేసింది. నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌...ఈ రోజు ఏకకాలంలో మూడు చోట్ల సిట్ అధికారులు..

Telangana: టీఎస్‌పీఎస్‌సి పేపర్ లీక్ కేసులో దూకుడు పెంచిన సిట్.. రాజశేఖర్ స్వగ్రామంలో విచారణ..
Tspsc
Shiva Prajapati
|

Updated on: Mar 21, 2023 | 3:18 PM

Share

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తుని ముమ్మరం చేసింది. నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌.. ఈ రోజు ఏకకాలంలో మూడు చోట్ల సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌ స్వగ్రామానికి తరలివెళ్ళింది సిట్‌ అధికారుల బృందం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి వెళ్ళి రాజశేఖర్‌ వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తున్నారు. పేపర్లు ఇంకా ఎవరెవరి చేతుల్లోకి చేరాయన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు.. స్నేహితులను ఆరా తీస్తున్నారు. పరీక్ష రాసిన రాజశేఖర్‌ బంధువులు ఎవరన్నదానిపై విచారిస్తోంది సిట్‌ బృందం. విదేశాల నుంచి పరీక్షలు రాయడం.. ఆర్థికలావాదేవీలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీలో కీలకసూత్రధారి.. స్కాం స్టోరీని అత్యంత పకడ్బందీగా నడిపించిన రేణుకతో పాటు భర్త డాక్యా నాయక్ తో కలిసి ముందుగా లంగర్ హౌస్ సన్ సిటీ లోని ఖాళీ మందిర్ కి వెళ్లి అక్కడ అనుమానితులను విచారించింది మరో బృందం. అటు నుంచి రేణుక సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా.. గండ్వీడ్ వెళ్లిన సిట్ టీమ్ పేపర్‌ లీకేజీపై మరిన్ని విషయాలను రాబట్టేందు ప్రయత్నిస్తోంది.

ఇక హైదరాబాద్‌లో మరో ఏడుగురు నిందితులను సిట్‌ కార్యాలయానికి తరలించారు పోలీసులు. పేపర్‌ లీకేజ్‌ స్కాంలో ఇన్వాల్వ్‌ అయిన వాళ్ళు ఇంకెవరెవరున్నారనే దానిపై విచారిస్తున్నారు సిట్‌ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..