AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది.. బీఆర్ఎస్ ఏర్పాటుపై రేవంత్ ఫైర్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలపాలనే నేతల మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రతిపాదన తెర పైకి వస్తే అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ...

Revanth Reddy: కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది.. బీఆర్ఎస్ ఏర్పాటుపై రేవంత్ ఫైర్..
Revanth Reddy
Ganesh Mudavath
|

Updated on: Dec 09, 2022 | 6:27 PM

Share

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలపాలనే నేతల మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రతిపాదన తెర పైకి వస్తే అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనతో పాటు ఆ రాష్ట్రానికే చెందిన మంత్రులు, నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతుండటం గమనార్హం. అయితే వారి కామెంట్లకు తెలంగాణ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. ఇలా మాట్లాడడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతోందని మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణను ఏపీలో కలిపేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఏమాత్రం స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగింది. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం ఇది. నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అవుతుంది. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి. సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఈ రోజు నుంచి కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది. బీజేపీకి సహకరించడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే బీఆర్ఎస్ లక్ష్యం.

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. సమైక్య రాష్ట్రంపై సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం స్పష్టం చేశారు సజ్జల. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.