Chalo Raj Bhavan : ‘నాది బాధ్యత.. టిపిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వానికి నేను హామీ ఇస్తున్నా..’ : రేవంత్ రెడ్డి

'తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్న.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తాం.'..

Chalo Raj Bhavan : 'నాది బాధ్యత.. టిపిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వానికి నేను హామీ ఇస్తున్నా..' : రేవంత్ రెడ్డి
Revanth
Follow us

|

Updated on: Jul 16, 2021 | 11:48 AM

Chalo Raj Bhavan – Revanth Reddy: ‘తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్న.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తాం.’ అని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పిలుపు మేరకు చేస్తున్న ఈ కార్యక్రమం నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ధర్నా చౌక్ దగ్గర్నుంచి రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించాలని ఆయన కోరారు.

“మా సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించవద్దు. ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేస్తే చూస్తూ ఊరుకోం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. గృహ నిర్బంధం చేసిన వారిని వదిలిపెట్టాలి” అని రేవంత్ డిమాండ్ చేశారు.  40 రూపాయలు పెట్రోల్ ను 105 రూపాయలకు విక్రయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని రేవంత్ ఈ సందర్భంగా ఆరోపించారు. కొంచెం సేపటి క్రితం ‘చలో రాజ్ భవన్’ నిరసనపై ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపేందుకు ఈ దేశ పౌరులుగా మాకు హక్కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే లక్షలాదిమంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారని రేవంత్ హెచ్చరించారు. పోలీసులు తమ విచక్షణ మేరకు అధికారాలు మేరకు విధులు నిర్వహించాలని, పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి.

Read also: Raj Bhavan : ఉద్రిక్తతలకు దారితీసేలా పరిస్థితులు..! రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన కార్యకర్తలు.. పోలీసులు హై అలర్ట్

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!