Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియమించింది. అలాగే హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్కు, అమయ్కుమార్ను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇక ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్ రాహుల్ రాజ్ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ చేసింది. అలాగే నారాయణరెడ్డిని వికారాబాద్ కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్కు మెదక్ కలెక్టర్ ఎస్ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్గా, ఎస్ హరీశ్రాను రంగారెడ్డి కలెక్టర్గా, రాజశ్రీ షాను మెదక్ కలెక్టర్గా, మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్ తేజ ఎస్ పవార్ వనపర్తి కలెక్టర్గా నియమించింది. ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్రెడ్డి నిర్మల్ కలెక్టర్గా, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు జగిత్యాల కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి