Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం

నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందారు.

Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం
Old Couple Died
Follow us

|

Updated on: Jan 13, 2022 | 12:01 PM

నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. తెల్‌దేవరపల్లిలో గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(87) లక్ష్మమ్మ(80) భార్యాభర్తలు. వయసు మీద పడ్డా… పట్టణాల్లో స్థిరపడ్డ పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనయానం సాగిస్తున్నారు. భార్య లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవాజామున మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన అంతిరెడ్డి..  మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. తెల్లవారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. భార్య లేకుండా బ్రతకలేక ఆ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది.  అంతిరెడ్డి-లక్ష్మమ్మను ఒకే చితిపై కుటుంబసభ్యులు దహనం చేశారు. ఈ విషయం తెలిసినవారు నిజమైన దాంపత్య బంధం అంటే ఇది కదా అని మాట్లాడుకుంటున్నారు.

Also Read: APSRTC: అదంతా మోసం, నమ్మొద్దు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక హెచ్చరిక

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..