AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..
Padma Devender Reddy
Basha Shek
|

Updated on: Jan 13, 2022 | 11:49 AM

Share

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్‌‌ఎస్‌ మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలంటూ పద్మా దేవేందర్‌ రెడ్డి కోరారు. కాగా ఇటీవల టీఆర్ఎస్ నేతలు వరుసగా వైరస్‌ బారిన పడుతున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఇటీవల కరోనా బాధితుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే . తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో నిరంతరం బిజీగా ఉండే నేతలు కరోనా బారిన పడుతుండడంతో శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతండడంతో ఇప్పటికే వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. ఆదివారం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్