Covid-19: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్!

కరోనావైరస్ థర్డ్ వేవ్ ఎవరిని వదలడం లేదు. కొత్త వేరియంట్ రూపంలో దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ను తాకింది.

Covid-19: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్!
Kidambi Srikanth
Follow us

|

Updated on: Jan 13, 2022 | 11:47 AM

India open badminton Players Corona: కరోనావైరస్ థర్డ్ వేవ్ ఎవరిని వదలడం లేదు. కొత్త వేరియంట్ రూపంలో దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ను తాకింది. ఈ వైరస్ కారణంగా భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ షట్లర్లందరూ భారతీయులేనని అధికారులు చెప్పారు. దీంతో ఆటగాళ్లందరూ ఈ టోర్నీ నుండి నిష్క్రమించారు. ఈ ఆటగాళ్లకు మంగళవారం RT-PCR పరీక్ష జరిగింది. దీనిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధికారిక సమాచారం ఇచ్చింది. దీంతో ఈ ఆటగాళ్ల ప్రత్యర్థులు తదుపరి రౌండ్‌కు వాకోవర్ పొందుతారు.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కరోనా కలకలం సృష్టించింది. బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కరోనా సోకడం ఇదే మొదటిసారి కాదు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, బి. సాయి ప్రణీత్, ధ్రువ్ రావత్ పాజిటివ్ రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంగ్లండ్ జట్టు కూడా టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ఆ తర్వాత టోర్నమెంట్‌ ఆడుతున్న పలువురు ఆటగాళ్లు వైరస్ బారినపడుతున్నారు.

కరోనా సోకిన ఆటగాళ్లుః

కిదాంబి శ్రీకాంత్ అశ్విని పొన్నప్ప రితికా రాహుల్ థాకర్ తెరెసా జాలీ సిమ్రాన్ అమన్ సింగ్ ఖుషీ గుప్తా మిథున్ మంజునాథ్

ఇదిలావుంటే, గత సీజన్‌లో ఆడలేకపోయిన సైనా నెహ్వాల్‌ను ఈసారి టోర్నీలో పాల్గొంటున్నారు. ఆమె రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తన ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి తెరెజా స్వాబికోవా రిటైర్మెంట్‌తో వెనుదిరగడంతో సైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

Read Also… Omicron Alert: బీ అలర్ట్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో వారికి ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడి

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!