Telangana: పాఠశాల ముసుగులో పాడు పనులు.. ఆరా తీయగా బయటపడిన షాకింగ్ విషయాలు..

Telangana: ప్రస్తుతం కాలంలో మోసగాళ్లు మరీ ఎక్కువైపోతున్నారు. ప్రజల అవసరాలు, ఆశలను ఆసరగా చేసుకుని దర్జాగా అందినకాడికి దండుకుంటున్నారు.

Telangana: పాఠశాల ముసుగులో పాడు పనులు.. ఆరా తీయగా బయటపడిన షాకింగ్ విషయాలు..
Fir
Follow us

|

Updated on: Oct 08, 2021 | 9:25 AM

Telangana: ప్రస్తుతం కాలంలో మోసగాళ్లు మరీ ఎక్కువైపోతున్నారు. ప్రజల అవసరాలు, ఆశలను ఆసరగా చేసుకుని దర్జాగా అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలో మూతపడిన ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచి ఎంఈవో సంతకం ఫోర్జరీ చేసి టీసీ, బోనఫైడ్‌ ధ్రువపత్రాలు జారీ చేసిన ఘటన బయటపడింది. దీనిపై కూపీ లాగిన పోలీసు అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. వివరాల్లోకెళితే.. ఇటీవల గురుకులం, ఆదర్శ, జ్యోతిబా పూలే, నవోదయ పాఠశాలల్లో అర్హత సాధించిన విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు తమ ఓరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. అయితే, ఈ సర్టిఫికెట్లపై అధికారులకు అనుమానం రావడంతో ఆరా తీశారు. దీంతో ఈ సర్టిఫికెట్ల దందా వెనుక ఉన్న అసలు బాగోతం బయటపడింది.

పన్నేండేళ్ల క్రితం మూతపడిన పాఠశాల నుంచి విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ పత్రాలపై మందమర్రి మండలం, ఆదిలాబాద్‌ జిల్లా పేరుతో స్టాంపు ఉండడంతో పాటు మండల విధ్యాధికారి సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. కాసిపేట, బెల్లంపల్లి, మందమర్రి మండలాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వివిధ తరగతుల్లో చేరేందుకు 15 మంది నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఒక్కో విద్యార్థికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు మూతపడిన పాఠశాల యాజమాన్యం 3 వేల నుంచి 10వేల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, నకిలీ ధ్రువపత్రాలతో గురుకులం పాఠశాలలో సీటు పొందిన 15 మంది విద్యార్థుల సీట్లను రద్దు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూత పడిన ప్రగతి విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జాడి పోచయ్య తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

IPL 2021: ప్లేఆఫ్స్‌లో అమీతుమీ పోరుకు అంతా సిద్దం.. ముంబై ఆశలు గల్లంతు.!

NASA 16 Psyche: ఆ ఉల్క భూమికి చేరితో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!.. నాసా పరిశోధనలో షాకింగ్ అంశాలు..

Garuda Puranam: ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే.!

పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే