Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో..

Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Teacher
Follow us

|

Updated on: Jun 20, 2022 | 2:58 PM

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

కోర్టు ఉత్తర్వులతో..

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది.

దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రమోషన్లు ఎప్పుడు..

బదిలీలు, ప్రమోషన్లను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?