AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో..

Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Teacher
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2022 | 2:58 PM

Share

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

కోర్టు ఉత్తర్వులతో..

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది.

దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రమోషన్లు ఎప్పుడు..

బదిలీలు, ప్రమోషన్లను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..