AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నార్సింగిలో పోకిరీల వీరంగం! యువతిపై నీళ్లు.. నిలదీసినందుకు తండ్రి గొంతుకోసి పరార్‌

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. స్థానిక దుకాణంకి వెళ్లిన ఓ యువతిపై బహిరంగ ప్రదేశంలో నీళ్లు పోసి హేళన చేశారు. హోలీ రోజున తప్పించుకున్నావని ఇప్పుడు తప్పించుకోలేవని యువతిపై నీళ్లు కుమ్మరించారు. ఇదేంటని యువతి తండ్రి ప్రశ్నించగా పదునైన కత్తితో అతని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్‌లో..

Hyderabad: నార్సింగిలో పోకిరీల వీరంగం! యువతిపై నీళ్లు.. నిలదీసినందుకు తండ్రి గొంతుకోసి పరార్‌
Gang Attacked With Knife On Man
Srilakshmi C
|

Updated on: Apr 01, 2024 | 5:27 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 1: హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. స్థానిక దుకాణంకి వెళ్లిన ఓ యువతిపై బహిరంగ ప్రదేశంలో నీళ్లు పోసి హేళన చేశారు. హోలీ రోజున తప్పించుకున్నావని ఇప్పుడు తప్పించుకోలేవని యువతిపై నీళ్లు కుమ్మరించారు. ఇదేంటని యువతి తండ్రి ప్రశ్నించగా పదునైన కత్తితో అతని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్‌లో సోమవారం (ఏప్రిల్ 1) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పరిధిలోని నెమలి నగర్‌కు చెందిన ఓ యువతి సోమవారం ఉదయం తన ఇంటికి సమీపంలోని దుకాణానికి కిరాణా సరుకుల కోసం వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్‌ అనే వ్యక్తి, అతడి స్నేహితులు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. హోలీ రోజు దొరకలేదంటూ ఆమెపై నీళ్లు పోసి హేళన చేశారు. పోకిరీల అసభ్యప్రవర్తన వల్ల అవమానంగా భావించిన యువతి భయంతో వారి నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి చేరింది. దుకాణానికి వెళ్లిన కుమార్తె ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడిగి జరిగిన విషయం తెలుసుకున్నారు.

దీంతో కోపోద్రిక్తుడైన యువతి తల్లిదండ్రలు పోకిరీల దగ్గరకు వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన సురేశ్‌ ఫ్రెండ్‌ ప్రవీణ్‌ యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డొచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. పోకిరీల నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్‌, ప్రవీణ్‌లతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 4 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?