AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: ఈ నెల 21 నుంచి పల్లె ‘గోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలు.. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు వీరే..

ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న పల్లె గోస.. బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Telangana BJP: ఈ నెల 21 నుంచి పల్లె ‘గోస - బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలు.. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు వీరే..
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2022 | 8:03 AM

Share

Palle Gosa – BJP Bharosa: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ‘ప్రజాసంగ్రామయాత్ర’, పదిరోజులపాటు ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ విధంగా పాదయాత్ర, బైక్‌ ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి ఒక క్రమపద్ధతిలో కొనసాగించనున్నారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న పల్లె గోస.. బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

తొలి విడత పల్లె గోస – బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీ ముగిసిన తర్వాత ఆగస్టు 2 నుంచి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్ర-3 మొదలుకానుంది. ఇరవై రోజుల తర్వాత ఈ పాదయాత్ర ముగియగానే రెండోవిడత బైక్‌ర్యాలీ కొనసాగనుంది. ఈ మేరకు బైక్‌ర్యాలీలో పాల్గొనే నేతలతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలతోపాటు ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నారు.

నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు..

ఇవి కూడా చదవండి

జుక్కల్ నియోజకవర్గం – వివేక్ వెంకటస్వామి, దేవరకద్ర – ఈటల ఎమ్మెల్యే రాజేందర్, ఆదిలాబాద్​- ఎంపీ అర్వింద్, మంచిర్యాల – ఎంపీ సోయం బాపురావు, వేములవాడ – యెండల లక్ష్మీ నారాయణ, బోధన్​- ఎమ్మెల్యే రాజాసింగ్, సిద్దిపేట – మురళీధర్ రావు, తాండూర్​- డీకే అరుణ, మేడ్చల్​- జితేందర్ రెడ్డి, షాద్​నగర్​- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కల్వకుర్తి – బాబు మోహన్, నర్సంపేట్​- ఎమ్మెల్యే రఘునందన్ రావు, వనపర్తి – ఎంపీ లక్ష్మణ్, కొత్తగూడెం – గరికపాటి మోహన్ రావు పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ