గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు శాసనసభ ముందు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ బడ్జెట్ సెషన్ పూర్తి అయ్యే వరకు ముగ్గురు బీజేపీ సభ్యలను సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నల్ల కండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలుపారు. రాష్ట్రంలో రాజ్యాంగం విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.