AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..
Secunderabad
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 29, 2024 | 4:19 PM

Share

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సుదీర్ఘకాలంగా పోలీసులు అనేక రకాల ఆధారాలు సేకరించారు. 2017 లోనే రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ శ్రీధరన్ స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి కేసులో రిటైర్డ్ ఆర్మీ జవాన్‎ను మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. ఈ కేసు‎పై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరించి జావాన్‎కు శిక్షపడేలా చర్యలు తీసుకున్నారు.

ఒక బాలికను లాడ్జిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. లాడ్జి నుండి బయటికి వచ్చిన బాలిక నేరుగా మార్కెట్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లింది. మార్కెట్ పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఆర్మీ జవాన్ శ్రీధరన్‎పై అప్పటి మార్కెట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పోలీసులు అన్ని ఆధారాలను కోర్ట్‎కు పగడ్బందీగా సమర్పించడంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీధరన్‎కు 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది స్పెషల్ కోర్టు. ఈ సంఘటనతో పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు త్వరితగతిని పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజల్లో, సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..