AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..
Secunderabad
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 29, 2024 | 4:19 PM

Share

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సుదీర్ఘకాలంగా పోలీసులు అనేక రకాల ఆధారాలు సేకరించారు. 2017 లోనే రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ శ్రీధరన్ స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి కేసులో రిటైర్డ్ ఆర్మీ జవాన్‎ను మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. ఈ కేసు‎పై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరించి జావాన్‎కు శిక్షపడేలా చర్యలు తీసుకున్నారు.

ఒక బాలికను లాడ్జిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. లాడ్జి నుండి బయటికి వచ్చిన బాలిక నేరుగా మార్కెట్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లింది. మార్కెట్ పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఆర్మీ జవాన్ శ్రీధరన్‎పై అప్పటి మార్కెట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పోలీసులు అన్ని ఆధారాలను కోర్ట్‎కు పగడ్బందీగా సమర్పించడంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీధరన్‎కు 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది స్పెషల్ కోర్టు. ఈ సంఘటనతో పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు త్వరితగతిని పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజల్లో, సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..