AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇద్దరమ్మాయిలకు తాళికట్టిన శుభవేళ…. అంగరంగ వైభవంగా సత్తిబాబు పెళ్లి..

వరుడు ఒక్కడే.. కానీ వధువులు ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఇలా ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకుని.. ఒక్కడు కాస్తా ముగ్గురయ్యారు.

Telangana: ఇద్దరమ్మాయిలకు తాళికట్టిన శుభవేళ.... అంగరంగ వైభవంగా సత్తిబాబు పెళ్లి..
Marriage
Shiva Prajapati
|

Updated on: Mar 09, 2023 | 1:31 PM

Share

వరుడు ఒక్కడే.. కానీ వధువులు ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఇలా ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకుని.. ఒక్కడు కాస్తా ముగ్గురయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలపడం మరో విశేషం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు వరుడు సత్తిబాబు. అంతకుముందు.. ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నట్లు వెడ్డింగ్ ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేసి మరీ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించడం హాట్‌ టాఫిక్‌గా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ పెళ్లి.. ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇలా చేసుకోవడం వెనుక ఒక కారణం వినిపిస్తోంది. సత్తిబాబు సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరి అమ్మాయలను ప్రేమించాడు.

సంవత్సరం క్రితం నుంచి స్వప్న, సునీత ఇద్దరితో కలిసి సత్తిబాబు తన ఇంట్లో కాపురం చేస్తున్నాడు. అలాగే వారిద్దరికి ఒక్కో సంతానం కూడా జన్మించారు. అయితే సత్తిబాబు కోయ గిరిజన తెగకు చెందినవాడిగా తెలుస్తుంది. ఆ తెగకు చెందినవారు కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సత్తిబాబుకు ఏడాది కాపురం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇప్పుడు బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..