Sankranti 2024 Special Trains: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు
Railway Passenger Alert: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే శాఖ మరో తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సీజన్లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు..
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే శాఖ మరో తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సీజన్లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారంనాడు(4 జనవరి) ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు.. ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ – కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైలు నెం.07021 జనవరి 11న రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గం.లకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. అలాగే ఎదురు దిశలో ప్రత్యేక రైలు నెం.07022 జనవరి 12వ తేదీన సాయంత్రం 05.40 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
అలాగే ప్రత్యేక రైలు నెం.07023 జనవరి 12న సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గం.లకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13న రాత్రి 10.00 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
అలాగే హైదరాబాద్ – కాకినాడ టౌన్ మధ్య నడిచే రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట సంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఈ నాలుగు ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని ద.మ.రైల్వే శాఖ అధికారలుు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా నేరుగా రైల్వే బుకింగ్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణాలకు టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.
నాలుగు సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు..
జనవరి 2న రైల్వే శాఖ 32 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024