Telangana: అన్నం పెట్టే రైతులకే కోపం తెప్పించారు.! చూస్తూ ఊరుకుంటారా మరి.. ఏం చేశారో తెలిస్తే
అన్నం పెట్టే రైతులకు కోపం వస్తే.. ఏం జరుగుతుందో తెల్సా.! ఎండనక.. వాననక.. పొలాల్లో పని చేసే రైతులకు కోపం వచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

రైతులకు ఉండే ఓపిక అంత ఇంత కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని నష్టాలు వచ్చినా.. వాళ్లు చాలా ఓపికతో ఉంటూ.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాంటి రైతులకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.! వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రైతులకు కోపం వచ్చింది. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు ఆర్ఐ, జీపీవోలను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో చోటు చేసుకుంది.
ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు ఇస్తున్న రైతులకు ఆర్ఐ ప్రమోద్, జీపీవో ప్రవీణ్ కుమార్ నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి, అక్కడే బైఠాయించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారాన్ని చెల్లిస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 16 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడం అన్యాయమన్నారు. ఇప్పుడున్న విలువల ప్రకారం ఎకరా భూమికి కోటి రూపాయలకు పైనే వస్తుందని, ఇలా అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమికి భూమిని మరోచోట ఇవ్వాలని.. లేదంటే ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ రైతులు డిమాండ్ చేశారు.
