AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Students: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ భారతీయులు.. హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

Telugu Students: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ భారతీయులు.. హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు
Telugu Students
Balaraju Goud
|

Updated on: Feb 27, 2022 | 9:44 AM

Share

Russia Ukraine Crisis: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తరలించారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అక్కడే బస కల్పించారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండో విమానంలో 250మంది భారత్ చేరుకున్నారు. ఇందులో 11మంది ఏపి విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు 469మంది విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

మూడ్రోజులు మూడు యుగాలుగా గడిపారు. క్షణ క్షణం.. భయం భయం.. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఉక్రేనియన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు. ఉక్రెయిన్ నుండి ప్రత్యేక విమానంలో 20 మంది తెలుగు విద్యార్థులు ముంబైకి చేరుకున్నారు. అక్కనుండి ఇండిగో విమనంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వాగతం పలికారు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 20 మంది విద్యార్థులు చేరుకున్నారు. ముంబై నుంచి ఇండిగో విమానంలో వీరంతా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులను సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చిన ఏపీ, తెలంగాణతో పాటు ఇండియన్‌ ఎంబసీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ విద్యార్థులకు స్వాగతం పలికారు.

జహోనీ క్రాసింగ్ వద్ద ఉక్రెయిన్ నుంచి హంగేరీలో భారతీయ విద్యార్థులు బ్యాచ్‌లు ప్రవేశిస్తున్నారని హంగేరీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి బుడాపెస్ట్‌కు వెళతారు. ఎయిర్ ఇండియా మూడో విమానం ద్వారా భారతదేశానికి తీసుకువెళతారని అధికారులు తెలిపారు. దీనితో పాటు, ఉక్రెయిన్ నుండి హంగేరి మీదుగా బయలుదేరే భారతీయ విద్యార్థులకు ఎంబసీ కూడా సలహా ఇచ్చింది.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!