AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanthapur: రామంతపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనలో.. చికిత్స పొందుతూ ఏఓ కృష్ణా రెడ్డి మృతి!

ఇటీవల కలకలం రేపిన రామంతాపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనలో తీవ్ర గాయలపాలైన ఏవో అశోక్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఈ రోజు) మృతి చెందారు..

Ramanthapur: రామంతపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనలో.. చికిత్స పొందుతూ ఏఓ కృష్ణా రెడ్డి మృతి!
Ramanthapur Student Suicide
Srilakshmi C
|

Updated on: Sep 04, 2022 | 9:09 PM

Share

Ramanthapur Narayana College Suicide Bid: ఇటీవల కలకలం రేపిన రామంతపూర్‌ నారాయణ కాలేజ్‌ ఘటనలో తీవ్ర గాయలపాలైన ఏవో అశోక్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఈ రోజు) మృతి చెందారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న స్టూడెంట్‌ లీడర్‌ సందీప్‌ను కాపాడబోయి ప్రమాదవశాత్తు ఏఓ అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డికి మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాలపాలైన అశోక్‌రెడ్డిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం (సెప్టెంబర్‌ 4) తుదిశ్వాస విడిచారు. సందీప్‌, ప్రిన్సిపల్‌ సుధాకర్‌రెడ్డి ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగిందంటే.. ఇంటర్ సెకండియర్‌ ఇంటర్‌ పూర్తి చేసిన సాయినారాయణ టీసీ తీసుకునేందుకు కాలేజీకి వచ్చాడు. ఐతే ఫీజు బకాయి రూ.16 వేల బకాయి పడ్డాడు. పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ టీసీ ఇవ్వనని కాలేజీ ప్రిన్సిపాల్‌ తెగేసి చెప్పాడు. అప్పటికే విద్యార్ధి వరుసగా 2, 3 రోజులు కాలేజీకి రాగా, బకాయి పడ్డ ఫీజు మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో విద్యార్థి సాయినారాయణ స్టూడెంట్‌ లీడర్‌ సందీప్‌ను ఈ విషయమై సంప్రదించాడు. సందీప్‌ ప్రిన్సిపల్‌ సుధాకర్‌తో మాట్లాడుతున్న క్రమంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో సందీప్‌ అప్పటికే తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డికి కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయల పాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్న ఏఓ అశోక్‌ రెడ్డి ఈ రోజు మృతి చెందారు.