AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల వాయింపు

ఏపీ మీదుగా వెళ్లే వాహనదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఇందుకు ఏప్రిల్ 1న ముహూర్తం ఫిక్స్ చేశారు.

Andhra Pradesh: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల వాయింపు
Ap Toll Charges
Ram Naramaneni
|

Updated on: Mar 30, 2022 | 6:44 PM

Share

పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏపీలోని నేషనల్ హైవేస్‌పై  ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఫీజుల రూపంలో వాహనదారులకు బాదుడు షురూ అవ్వనుంది.  రాష్ట్రంలో  టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి.  2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఫైనల్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్‌ ఛార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ సవరించినట్లుగా సమాచారం అందుతుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.

  1. కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10కి పెంపు.
  2. బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కు పెంపు.
  3. భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50కి పెంపు.
  4. సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది

ఏపీలో అన్ని నేషనల్ హైవేస్‌పై కలిపి 57 టోల్‌ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్‌ వసూలవుతోంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.2,409 కోట్ల వరకు వస్తోంది. పెంచిన టోల్ ఛార్జీలతో ఈ మొత్తం ఇంకా పెరగనుంది.

Also Read:  ఒంట్లో బాలేదంటూ హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఆస్పతికి తీసుకువెళ్లగా పిడుగులాంటి వార్త