AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Pellikoduku: ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా ఐదుగురిని పెళ్లాడిన కేటుగాడు.. మాట్రిమోనీ నిత్య పెళ్లికొడుకు మోసాల తీరిది

Nithya Pellikoduku: పేద కుటుంబాన్ని ఎంచుకుంటాడు. మీ అమ్మాయిని బాగా చూసుకుంటానంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు కాపురం చేశాక పుట్టింట్లో దింపేసి వెళ్లిపోతాడు..

Nithya Pellikoduku: ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా ఐదుగురిని పెళ్లాడిన కేటుగాడు.. మాట్రిమోనీ నిత్య పెళ్లికొడుకు మోసాల తీరిది
Subhash Goud
|

Updated on: May 24, 2022 | 7:34 AM

Share

Nithya Pellikoduku: పేద కుటుంబాన్ని ఎంచుకుంటాడు. మీ అమ్మాయిని బాగా చూసుకుంటానంటూ నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు కాపురం చేశాక పుట్టింట్లో దింపేసి వెళ్లిపోతాడు. మాట్రిమోనీ నిత్య పెళ్లికొడుకు మోసాల తీరిది. ఒకరికి తెలియకుండా మరొకరిని, అలా ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు ఈ కేటుగాటు. మాట్రిమోనీ ద్వారా యువతులను మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులను ఆశ్రయించింది ఓ బాధితురాలు. పెద్దపల్లి జిల్లా వనపల్లి జిల్లా పాన్‌గల్‌ మండలం మంగళ్లపల్లికి చెందిన సగనమోని మద్దిలేటి అలియాస్‌ మధుతో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి లీలావిజయదుర్గతో పెళ్లి జరిగింది. నాలుగేళ్ల క్రితం మాట్రిమోనీ ద్వారా ఆమెను పెళ్లాడాడు మద్దిలేటి అలియాస్‌ మధు. అయితే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండగా పుట్టింట్లో దింపి వెళ్లిపోయాడు. వెళ్లినోడు మళ్లీ తిరిగి రాకపోవడంతో భర్త కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టింది. వెతగ్గావెతగ్గా పెద్దపల్లి జిల్లా మంథనిలో మధును గుర్తించింది విజయదుర్గ. ఆరు నెలలక్రితం మరో యువతిని పెళ్లి చేసుకుని మంథనిలో కాపురం పెట్టినట్టు తెలుసుకుంది. ఇప్పుడున్న ఆమె ఐదో భార్యని, తాను నాలుగో భార్య అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

తన కంటే ముందు, మరో ముగ్గురిని ఇలాగే పెళ్లి చేసుకుని మోసం చేశాడని అంటోంది బాధితురాలు విజయదుర్గ. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ మోసం చేస్తున్న మోసగాడు మధుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది విజయదుర్గ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి