Telangana: ప్రజాకోర్టులో గ్రామస్తుడికి మరణశిక్ష.. అందుకేనంటూ మావోయిస్టుల ప్రకటన..

ప్రజాకోర్టులో ఓ గ్రామస్తుడికి మరణ శిక్ష విధించారు మావోయిస్టులు. పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశ పడి రెండేళ్లుగా ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనే నెపంతో..

Telangana: ప్రజాకోర్టులో గ్రామస్తుడికి మరణశిక్ష.. అందుకేనంటూ మావోయిస్టుల ప్రకటన..
Maoist
Follow us

|

Updated on: Oct 27, 2022 | 7:33 PM

ప్రజాకోర్టులో ఓ గ్రామస్తుడికి మరణ శిక్ష విధించారు మావోయిస్టులు. పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశ పడి రెండేళ్లుగా ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనే నెపంతో అతనికి ఈ శిక్ష విధించారు మావోయిస్టులు. చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. చత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్ పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడి బసంత్ గత రెండు సంవత్సరాలుగా పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రజా కోర్టులో అతన్ని నిలబెట్టి మరణ శిక్ష విధించినట్లు తెలిపారు మావోలు. పోలీసులకు ఇన్‌ఫార్మర్ గా మారి మావోయిస్టులు ఆచూకీ తెలిపేందుకు పోలీసుల వద్ద నుంచి రూ. 10 లక్షలు తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఆ డబ్బు కోసం పని చేస్తూ మావోయిస్టుల జాడ కోసం ప్రయత్నించాడని లేఖలో మావోలు పేర్కొన్నారు.

ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు. సామాన్య ప్రజల చావులకు ప్రభుత్వాలు, పోలీసులే కారణం అని ఆరోపించారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవోద్యమ గ్రామాలలో ప్రజల అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకుని యువతను ఇన్‌ఫార్మర్‌గా తయారు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ఇన్‌ఫార్మర్లుగా మారుస్తూ వారి చావులకు కారణం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే బసంత్‌కు కూడా డబ్బు ఆశ చూపి ఇన్‌ఫార్మర్‌గా నియమించుకున్నారని అన్నారు.

కొత్తపల్లి గ్రామంలోని క మిటీ నాయకుల సమాచారం, పార్టీ సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేశాడని , పోలీసుల మాటలు నమ్మి, వారు ఇచ్చిన డబ్బు తీసుకుని బసంత్ జిత్తుల మారి ఎత్తుగడలను అమలు చేశాడని లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. ఇలా మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజా శత్రువుగా బసంత్ మారాడని, పీఎల్జీఏ అతన్ని పట్టుకొచ్చి ప్రజా కోర్టులో విచారించడం జరిగిందన్నారు. ఈ ప్రజా కోర్టులో బసంత్ తాను చేసిన ద్రోహాన్ని అంగీకరించాడని, మెజారిటీ అభిప్రాయం మేరకు అతనికి మరణ శిక్ష విధించడం జరిగిందని తెలిపారు మావోయిస్టులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు