Telangana: బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు రద్దు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో జరిగే ప్రచారానికి నడ్డా, అమిత్షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తున్నారిని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని, బీజేపీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అందరూ మోసం చేశారన్న కిషన్ రెడ్డి.. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి వారికి అండగా నిలిచింది...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేబినేట్ నిర్ణయం తీసుకుని ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని తెలిపారు. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్న కిషన్ రెడ్డి.. బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తుందని తెలిపారు.
తెలంగాణలో జరిగే ప్రచారానికి నడ్డా, అమిత్షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తున్నారిని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని, బీజేపీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అందరూ మోసం చేశారన్న కిషన్ రెడ్డి.. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి వారికి అండగా నిలిచింది బీజేపీ మాత్రమే అన్నారు.
బీసీ కులాలు, సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయన్న కిషన్ రెడ్డి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులకు పాలన చేయడం చేతకాదని, అందుకే తానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నానని వారిని అవమానించారు. దళితులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బీఆర్ఎస్ది అని కిషన్ రెడ్డి విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలో మంత్రి వర్గంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి కాంగ్రెస్ పార్టీ, బీసీలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. దీనివల్ల బీసీల సీట్లు ముస్లింలకు పోయాయనన్నారు. మైనార్టీ, దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, మజ్లీస్ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఒవైసీ అనుమతి లేనిదే హైదరాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తిరగలేరని కిషన్ రెడ్డి అన్నారు.
మజ్లీస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజాన్నిపెంచి పోషిస్తుందని విమర్శించిన కిషన్ రెడ్డి, సంఘ విద్రోహ శక్తులు, అరాచకాలు చేసే వారిపై యూపీలో యోగి సర్కార్ తరహాలో బుల్డోజర్లు దింపుతామన్నారు. కాంగ్రెస్ పోయిందనుకుంటే.. బీఆర్ఎస్ వచ్చి ప్రజల రక్తాన్ని తాగుతోందన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో తొలగించి.. తెలంగాణ సకల జనుల పాలన తీసుకోస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఫామ్ హౌజ్ లో పడుకునే ముఖ్యమంత్రి ఉండడు.. రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి వస్తాడని కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోలాగా గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే పార్టీ బీజేపీ కాదన్న కిషన్ రెడ్డి.. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారని.. మేము బీసీ ప్రధానిని చేశాం, దళిత, గిరిజనులను రాష్ట్రపతిని చేశాం, బీసీ ముఖ్యమంత్రిని చేయడం మాకో లెక్కా అని పునరుద్ఘాటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
