అవినీతి అధికారులకు కనువిప్పు కలిగించేలా వినూత్న ప్రదర్శన.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
లంచాలు తీసుకునే అవినీతి అధికారులను బిచ్చగాళ్ళతో పోల్చుతూ హనుమకొండలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బెగ్గర్స్ అందర్నీ ఒక్కచోటికి చేర్చి వారితో అవినీతి అధికారులకు కనువిప్పు కలిగేలా వినూత్న ప్రదర్శన చేపట్టారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో చేపట్టిన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది.

లంచాలు తీసుకునే అవినీతి అధికారులను బిచ్చగాళ్ళతో పోల్చుతూ హనుమకొండలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బెగ్గర్స్ అందర్నీ ఒక్కచోటికి చేర్చి వారితో అవినీతి అధికారులకు కనువిప్పు కలిగేలా వినూత్న ప్రదర్శన చేపట్టారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో చేపట్టిన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది.
కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతికి అంతం లేకుండా పోతుంది. అవినీతి నిర్మూలన సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎంతమంది అవినీతిపరులు కటకటాల పాలవుతున్నా లంచాలకు కక్కుర్తి పడిన పందికొక్కుల పనితీరు మాత్రం మారడం లేదు. చేయి తడపనిదే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగడం లేదు.
గడిచిన ఏడాది వ్యవధిలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మంది ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీకి చిక్కిన వాళ్లలో అడిషనల్ కలెక్టర్ స్తాయి అధికారి కూడా ఉన్నారు. వాళ్ల స్థాయికి తగ్గట్టు లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యారు. వాళ్ల ఇళ్లలో సోదాలు చేస్తే కోట్లాది రూపాయల ఆస్తులు, కరెన్సీ కట్టలు లభ్యమయ్యాయి. తాజాగా హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో బయటపడ్డ డబ్బుల కట్టలు జనమంతా నివ్వేరా పోయేలా చేశాయి.
కొందరు అవినీతి అనకొండల వల్ల ప్రభుత్వం అప్రతిష్టల మూట కట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. లంచాలు తీసుకునే అవినీతి అధికారుల కంటే పొట్టకూటి కోసం బిక్షం ఎత్తుకునే బిచ్చగాళ్ళు ఎంతో మేలని పిలుపునిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టారు. హనుమకొండ నగరంలో చేపట్టిన ఈ డిఫరెంట్ ర్యాలీ జనమంతా ఆసక్తిగా తిలకించేలా చేసింది.. అవినీతిపరులకు కనువిప్పు కలిగేలా చేసిన ఈ వినూత్న ర్యాలీ జనంలో చర్చగా మారుతుంది..
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
