AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఇవాళ ఈ రూట్లలో ట్రాపిక్‌ ఆంక్షలు, మళ్లింపులు

ఇవాళ (ఏప్రిల్‌2)న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది.

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఇవాళ ఈ రూట్లలో ట్రాపిక్‌ ఆంక్షలు, మళ్లింపులు
Hyderabad Traffic Restrictions
Basha Shek
|

Updated on: Apr 02, 2023 | 5:30 AM

Share

క్రికెట్‌ అభిమానులను అలరిస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2016 లీగ్‌ చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్‌2)న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. స్టేడియానికి నాలుగు ప్రధాన మార్గాల్లో వెహికిల్స్​ను అనుమతిస్తామన్నారు. అయితే భారీ వాహనాలకు ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉప్పల్ స్డేడియానికి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్ హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే భారీ వాహనాలు.. చెంగిచెర్ల చౌరస్తా, చెర్లపల్లి, ఐవోసీఎల్, ఎన్​ఎఫ్​సీ మీదుగా వెళ్లాలని సూచించారు. మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే హెవీ వెహికిల్స్ చెర్లపల్లి, చెంగిచెర్ల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కాగా మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా స్టేడియం లోపల అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు. మ్యాచ్​ ముగిసిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. బ్లాక్​లో టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ మధ్యలో ఎవరూ స్టేడియం లోపలికి రావొద్దన్నారు. అలా వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. స్టేడియంకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..