AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో స్టేషన్ల వద్ద బైక్ పార్క్ చేస్తున్నారా.? సరాసరి ఇక అస్సాంకే

హైదరాబాద్‌లో బైక్ చోరీ చేసే ముఠాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైకులను నిందితులు కాజేస్తున్నారు. మెట్రో స్టేషన్ల పార్కింగ్‌లో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠా..

Hyderabad: మెట్రో స్టేషన్ల వద్ద బైక్ పార్క్ చేస్తున్నారా.? సరాసరి ఇక అస్సాంకే
Metro
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 06, 2024 | 1:52 PM

Share

హైదరాబాద్‌లో బైక్ చోరీ చేసే ముఠాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైకులను నిందితులు కాజేస్తున్నారు. మెట్రో స్టేషన్ల పార్కింగ్‌లో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠా ఇటీవల పోలీసులకు చిక్కింది. తన బైక్‌ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు వెల్లువలో ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువగా మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలే మాయమవుతున్నట్లు గుర్తించారు. దీంతో మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను కనిపెట్టారు.

ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు ఇలాంటి చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరాల ద్వారా లభించిన ఆధారాలతో పాటు సాంకేతిక ఎవిడెన్స్‌ను బట్టి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్‌లను చోరీ చేసి ఇతర జిల్లాలకు వాటిని తరలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నాగోల్, ఎల్బీనగర్ లాంటి మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైకులను అపహరించిన దుండగులు వాటిని నల్గొండకి తరలించారు. తాజాగా ఖమ్మంలోని అశ్వరావుపేటలో మరికొన్ని చోరీ చేయబడ్డ బైకులను పోలీసులు గుర్తించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఇప్పటివరకు 70కి పైగా బైకులను ఈ తరహాలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం చోరీ చేయబడ్డ ఇతర బైక్‌లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 30కి పైగా బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠా ఎక్కడివారన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరిని హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన వాహనాలు ఎక్కడ దాచారన్న విషయంపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.